RBI : రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
- రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
- 100 శాతం 2 వేల నోట్లు రిటర్న్ కాలేదు
- ఇంకా ప్రజల వద్ద రూ.6,181 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయి
- ఎంపికి చేసిన పోస్టాఫీసుల్లో 2 వేల నోట్లు మార్చుకోవచ్చు :ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI : దేశంలో గడచిన కొన్ని సంవత్సరాలుగా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు దశలవారీగా మార్కెట్ నుంచి తొలగించబడుతున్నాయి. ఇప్పటికే ఎక్కువ శాతం నోట్లను ప్రజలు బ్యాంకుల ద్వారా తిరిగి ఇచ్చారు. అయితే తాజాగా ఈ ప్రక్రియకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు తిరిగి వచ్చిన రూ.2 వేల నోట్ల పరిమాణం 98.26 శాతానికి చేరింది. ఇది మొత్తం విడుదల చేసిన నోట్లలో మెజారిటీ భాగం కావడం గమనార్హం. అయితే ఇంకా దేశవ్యాప్తంగా ప్రజల వద్ద సుమారు రూ.6,181 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు మిగిలినట్టు ఆర్బీఐ గుర్తించింది.
Drug Peddlers Arrested: కూకట్పల్లిలో డ్రగ్స్.. ఏపీకి చెందిన ఆరుగురు అరెస్ట్
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
ఈ నోట్లను మార్చుకోవడానికి ప్రజలు ఎంపిక చేసిన పోస్టాఫీసులు లేదా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. ఇంకా తమ వద్ద ఈ నోట్లు ఉన్నవారు వీలైనంత త్వరగా వాటిని సరైన మార్గంలో మార్చుకోవాలని సూచించింది. నగదు పరిమితిని నియంత్రించేందుకు, నల్లధనం నిలుపుదల, క్లీన్స్ నోట్ల పాలసీ అమలు వంటి కారణాలతో 2023లో రూ.2 వేల నోట్లు మార్కెట్ నుంచి ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇవి చెలామణిలో ఉండకుండానే క్రమంగా బ్యాంకులు తిరిగి స్వీకరిస్తున్నాయి. ఆర్బీఐ ఈ ప్రక్రియపై స్పష్టతనిచ్చిన సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంకా తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఆలస్యం చేయకుండా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం