Today (08-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో 2 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ బుధవారం 2 కీలక సూచీలు లాభాల్లో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం పెంచినప్పటికీ ఆ ప్రభావం ఈక్విటీ మార్కెట్పై ఏమాత్రం పడలేదు. ఐటీ, మెటల్, అదానీ గ్రూప్ స్టాక్స్ బెంచ్ మార్క్లకు మద్దతుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో గరిష్ట విలువలకు చేరాయి.
Today (07-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ పెద్దగా ఆశాజనకమైన పరిస్థితేమీ కనిపించలేదు. ఈ రోజు మంగళవారం ఉదయం రెండు కీలక సూచీలు స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకొని చివరికి నష్టాల్లోనే ముగిశాయి. మధ్యాహ్నం జరిగిన ట్రేడింగ్లో కొంత వరకు నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇంట్రాడేలో ఫైనాన్షియల్ షేర్ల కొనుగోళ్లు జరగటంతో కాస్త ఊరట పొందాయి.
Special Story on Global Recesssion Fears: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం శరవేగంగా దూసుకొస్తోంది. ఈ మేరకు పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన సంకేతాలు వెలువడకపోయినప్పటికీ ఆర్థిక సంస్థల ప్రతినిధులు మరియు ప్రముఖ ఆర్థికవేత్తలు సూచాయగా కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ఉక్రెయిన్లో యుద్ధం, జీరో కొవిడ్ పాలసీలో భాగంగా చైనా పాల్పడుతున్న క్రూరమైన చర్యలు, ద్రవ్యోల్బణం మరియు మంకీపాక్స్ కేసులతో స్టాక్ మార్కెట్లలో, ఎకానమీల్లో ఉత్సాహం కరువైంది.