Today (08-02-23) Stock Market Roundup: వడ్డీ రేటు పెరిగినా.. డోంట్ కేర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (08-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో 2 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ బుధవారం 2 కీలక సూచీలు లాభాల్లో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం పెంచినప్పటికీ ఆ ప్రభావం ఈక్విటీ మార్కెట్పై ఏమాత్రం పడలేదు. ఐటీ, మెటల్, అదానీ గ్రూప్ స్టాక్స్ బెంచ్ మార్క్లకు మద్దతుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో గరిష్ట విలువలకు చేరాయి.
సెన్సెక్స్ చివరికి 377 పాయింట్లు పెరిగి 60,663 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,871 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 24 సంస్థలు లాభాల బాటలో నడిచాయి. ఆరు కంపెనీలు మాత్రమే నష్టాల బారినపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఒక శాతం మెరుగుపడింది. స్మాల్ క్యాప్ 0.76 శాతం లాభపడింది.
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
read more: The India Box Office Report-October: వెండి తెరను మురిపించి.. మెరిపించిన సం‘చలన’ చిత్రం..
నిఫ్టీలో అందానీ ఎంటర్ప్రైజెస్ షేరు ధర ఏకంగా 23 శాతం పెరిగింది. అదానీ పోర్ట్స్ స్టాక్స్ 9 శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హిండాల్కో, రిల్ తదితర సంస్థలు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించాయి. సెక్టార్ల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం జంప్ అయింది. ఐటీ సూచీ ఒకటిన్నర శాతం, ఫార్మా ఇండెక్స్ 1.43 శాతం పెరిగాయి.
10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 33 రూపాయలు పెరిగి అత్యధికంగా 57,290 రూపాయలు పలికింది. కేజీ వెండి రేటు 221 రూపాయలు లాభపడి గరిష్టంగా 67,750 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 98 రూపాయలు పెరిగి ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 461 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 22 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 54 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!