Today (08-02-23) Stock Market Roundup: వడ్డీ రేటు పెరిగినా.. డోంట్ కేర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (08-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో 2 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ బుధవారం 2 కీలక సూచీలు లాభాల్లో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం పెంచినప్పటికీ ఆ ప్రభావం ఈక్విటీ మార్కెట్పై ఏమాత్రం పడలేదు. ఐటీ, మెటల్, అదానీ గ్రూప్ స్టాక్స్ బెంచ్ మార్క్లకు మద్దతుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో గరిష్ట విలువలకు చేరాయి.
సెన్సెక్స్ చివరికి 377 పాయింట్లు పెరిగి 60,663 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,871 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 24 సంస్థలు లాభాల బాటలో నడిచాయి. ఆరు కంపెనీలు మాత్రమే నష్టాల బారినపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఒక శాతం మెరుగుపడింది. స్మాల్ క్యాప్ 0.76 శాతం లాభపడింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
read more: The India Box Office Report-October: వెండి తెరను మురిపించి.. మెరిపించిన సం‘చలన’ చిత్రం..
నిఫ్టీలో అందానీ ఎంటర్ప్రైజెస్ షేరు ధర ఏకంగా 23 శాతం పెరిగింది. అదానీ పోర్ట్స్ స్టాక్స్ 9 శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హిండాల్కో, రిల్ తదితర సంస్థలు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించాయి. సెక్టార్ల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం జంప్ అయింది. ఐటీ సూచీ ఒకటిన్నర శాతం, ఫార్మా ఇండెక్స్ 1.43 శాతం పెరిగాయి.
10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 33 రూపాయలు పెరిగి అత్యధికంగా 57,290 రూపాయలు పలికింది. కేజీ వెండి రేటు 221 రూపాయలు లాభపడి గరిష్టంగా 67,750 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 98 రూపాయలు పెరిగి ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 461 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 22 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 54 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!