హీరో శర్వానంద్, డైరెక్టర్ కిశోర్ తిరుమల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. తొలిసారి శర్వానంద్ సరసన నాయికగా నటిస్తోంది రశ్మికా మందణ్ణ. అంతేకాదు… కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి. మంగళవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. పలు తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న రశ్మిక… మొదటిరోజు శర్వానంద్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనడం విశేషం. అలానే శర్వానంద్…
ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు సంబంధించి అన్ని విభాగంలోని అప్డేట్స్ వచ్చేశాయి. ఇక అందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా కథానాయిక పేరు కూడా అతిత్వరలోనే రానుంది. ఇప్పటికే చిత్రబృందం పేరును ఖరారు చేసినట్లు సమాచారం. టాలీవుడ్ లక్కీ గర్ల్ గా పేరొందిన రష్మిక మందాన మరోసారి తాను ఎంత లక్కీనో చెప్పబోయే అనౌన్స్ మెంట్ తొందరలోనే రాబోతుంది. రాంచరణ్ సరసన రష్మిక దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దిల్…
కాజల్, సమంత, కియారా అద్వాణీ… ఎవ్వరైనా డోంట్ కేర్ అంటోంది రశ్మిక మందణ్ణా! ఇంతకీ, విషయం ఏంటి అంటారా? ‘సరిలేరు నీకెవ్వరు’ బ్యూటీ తనకు దక్షిణాదిలో సరి వచ్చే వారెవరూ లేరంటూ ఇన్ స్టాగ్రామ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం రశ్మిక ఇన్ స్టా ఫాలోయర్స్ సంఖ్య, అక్షరాలా… 19.2 మిలియన్లు! అంటే, కోటి 92లక్షలు… దాదాపు రెండుకోట్ల మంది అభిమానులతో రశ్మిక సౌత్ బ్యూటీస్ లో టాప్ స్టార్ గా మారిపోయింది. ఇంత కాలం కాజల్ అగర్వాల్…
నిప్పులేనిదే పొగ రాదంటారు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం నిప్పు లేకుండానే ఎఫైర్స్ విషయంలో పొగను సృష్టించేస్తుంటుంది. కలిసి సినిమాలో నటిస్తే చాలు ఆ హీరోహీరోయిన్లకు అఫైర్స్ అంటగట్టేస్తారు. కానీ చిత్రం ఏమంటే… విజయ్ దేవరకొండ – రశ్మిక మందణ్ణ మధ్య మాత్రం అలాంటి సమ్ థింగ్స్ ఏమీ లేవని, వాళ్ళు జస్ట్ క్లోజ్ అండ్ స్పెషల్ ఫ్రెండ్స్ మాత్రమేనని బాలీవుడ్ మీడియా సర్టిఫికెట్ ఇచ్చేసింది. ‘గీత గోవిందం’లో తొలిసారి కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రశ్మిక…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం పునఃప్రారంభమైంది. అయితే తాజాగా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ యాంకర్ అనసూయ గురువారం నుంచి షూటింగ్ కు హాజరైంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో పుష్ప చిత్రబృందం షూటింగ్ కు ప్యాకప్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్…
తెలుగు వారితో బాటూ దేశంలోని చాలా మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. అందుక్కారణం భారీగా తీస్తోన్న ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ డ్రామాలో పలు భాషలకు చెందిన నటులు, టెక్నీషియన్స్ ఉండటం! ‘పుష్ప’లో మలయాళ స్టార్ ఫాహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాదు, ‘పుష్ప’ మూవీనే ఆయనకు టాలివుడ్ డెబ్యూ అవ్వనుంది! మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే మలయాళ, తమిళ రంగాల్లో గుర్తింపు పొందాడు ఫాహద్. అయితే,…
తెలంగాణలో సినిమా ధియేటర్లు నూరు శాతం ఆక్యుపెన్సీతో జూన్ 20 నుండి తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో ఆదేశాలు ఇచ్చేసింది. కానీ ఇక్కడి ఎగ్జిబిటర్స్ లో ఉలుకూ పలుకూ లేదు. అలానే గురువారం నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం జీవో జారీ చేసింది. అంతేకాదు…. ఇంతవరకూ టిక్కెట్ రేట్ల విషయంలో పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కాస్తంత వెసులుబాటు కల్పించబోతోంది. అయినా పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం రెండు రాష్ట్రాలలో…
చాలా తక్కువ సమయంలోనే రష్మిక మందన్న ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీకి తాజాగా ఓ నెటిజన్ నుంచి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఈ నటిని ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఒక అభిమాని “మీరు రోజులో ఎన్ని సిగరెట్లు తాగుతారు?” అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన ఆమె ఎప్పుడూ సిగరెట్లు తాగలేదని, సిగరెట్లు తాగేవారు అన్నా తనకు ఇష్టం…
కన్నడ సోయగం రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇటీవల “మిషన్ మజ్ను” చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఇందులో సిధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. రష్మిక తన సెకండ్ బాలీవుడ్ మూవీలో బిగ్ బిఅమితాబ్ బచ్చన్తో స్క్రీన్ పంచుకుంటుంది. ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్తో…