క్రిస్మస్ పై కన్నేసిన ‘పుష్ప’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సినిమా ధియేటర్లు నూరు శాతం ఆక్యుపెన్సీతో జూన్ 20 నుండి తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో ఆదేశాలు ఇచ్చేసింది. కానీ ఇక్కడి ఎగ్జిబిటర్స్ లో ఉలుకూ పలుకూ లేదు. అలానే గురువారం నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం జీవో జారీ చేసింది. అంతేకాదు…. ఇంతవరకూ టిక్కెట్ రేట్ల విషయంలో పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కాస్తంత వెసులుబాటు కల్పించబోతోంది. అయినా పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం రెండు రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకుంటేనే తమ చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Read Also: ‘ఇండిపెండెన్స్ డే’కి ముందు… విమానాలతో బరిలోకి అజయ్ దేవగణ్!
Also Read
- Yadhu Vamsi: 'నా కొడుకు సాధించాడు'.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
- Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
- Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో 'ధురందర్ 2'ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
- Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. '418'తో భయపెట్టేందుకు సిద్ధం!
నిజానికి ఈ యేడాది జనవరి, ఫిబ్రవరి మాసాలలో చాలా సినిమాలు యాభై శాతం ఆక్యుపెన్సీలోనే విడుదలై, మంచి విజయాలను అందుకున్న దాఖలాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో త్వరలో మీడియం బడ్జెట్ చిత్రాలు కొన్ని విడుదల కావచ్చు. కానీ పెద్ద సినిమాల నిర్మాతలు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ టీమ్ సైతం ఇదే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. దర్శక నిర్మాతలు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకుంటున్నా, మొదటి భాగాన్ని కూడా హడావుడిగా రిలీజ్ చేయాలని మాత్రం భావించడం లేదట.
ఎందుకంటే… ఆగస్ట్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే ఆస్కారం ఉందని, అది సర్దుమణగటానికి మూడు నెలలు పడుతుందని, సో… క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరి వారంలో తమ చిత్రాన్ని విడుదల చేస్తే సేఫ్ అని ‘పుష్ప’ టీమ్ భావిస్తోందట. ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ యేడాది చివరిలోనే రావచ్చని తెలుస్తోంది. మరి ఈలోగా మేకర్స్ ఏమైనా అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!