ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయన్నారు. సినిమా టిక్కెట్ రేట్లపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పానని… ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు రామ్గోపాల్ వర్మ తెలిపారు. Read Also: ప్రభాస్… హాలీవుడ్ హీరో అనిపించుకుంటాడా? సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే సినిమా క్వాలిటీ…
ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంపై తాజాగా ఆర్జీవీ, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకున్న ఆర్జీవీ మంత్రి పేర్ని నాని ఛాంబర్ లో కలిసి మాట్లాడుతున్నారు. గంట నుంచి కొనసాగుతున్న ఈ మీటింగ్ లో టికెట్ల రేట్ల తగ్గింపు వల్ల థియేటర్ యాజమాన్యాలకు నష్టం వాటిల్లుతుందని, ట్విట్టర్ వేదికగా తాను చెప్పిన అంశాలపై…
ఏపీలో గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ రేట్ల విషయంపై వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. ఇదే విషయంపై ఈరోజు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. ఇదివరకు ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు ప్రయత్నించి విఫలమైన ఈ అంశాన్ని వర్మ ఎలా డీల్ చేయబోతున్నాడు ? అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ, పేర్ని నానిది టైంపాస్ మీటింగ్, ఈ కార్పోరేట్ భేటీలో కేవలం…
గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక గత వారం రోజుల నుంచి ఈ ఇష్యూలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలదూర్చి సంచలనం సృష్టించిన విషయమూ విదితమే. ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు అంటూనే టికెట్ రేట్స్ ఇష్యూపై తనదైన రీతిలో ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన వర్మ.. ఏ ఒక్క మంత్రిని, చివరికి ముఖ్యమంత్రి…
వివాదాస్పద దర్శకుడు తాజాగా సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై తనదైన శైలిలో స్పందించి సంచలనం సృష్టించారు. గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయమై నెలకొన్న అనిశ్చితిపై ఆర్జీవీ స్పందించిన తీరు వార్తల్లో నిలిచింది. ఆంధ్రా పెద్దలతో సినీ పెద్దలు కలవడానికి, సమస్యలను విన్నవించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఆర్జీవీ ఎంట్రీతో వివాదం మరింత ముదిరింది. సిఎంమా టికెట్ రేట్ల విషయంలో మీ జోక్యం ఏంటి ? అంటూ లైవ్ లో ఆంధ్రప్రదేశ్…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏపీ టికెట్ రేట్ల విషయంపై తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆర్జీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ను బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 17న విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం “పుష్ప : ది రైజ్”ని ప్రశంసించారు. చాలా సందర్భాలలో అల్లు అర్జున్ని తన అభిమాన నటుడు అని పిలిచే ఈ దర్శకుడు…
టాలీవుడ్ సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ రేట్ల విషయమై మాటల యుద్ధం జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క అన్న చందానా ఈ ఇష్యూలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యి.. టాలీవుడ్ తరుపున తన ప్రశ్నలను ప్రభుత్వానికి వినిపిస్తున్నాడు. రెండు రోజుల నుంచి ఆర్జీవీ ప్రశ్నలకు అంతు లేదు. ప్రశ్నలతో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. వర్మ ట్వీట్లకు ఏపీ మంత్రి పేర్ని నాని సమాధానాలు…
గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన సినిమా టిక్కెట్ ధరల విషయంలో అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆర్జీవీ ధైర్యం చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సినిమాటోగ్రఫీ మంత్రికి, ఆర్జీవికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించే చర్చ నడుస్తోంది. తాజా ట్వీట్ లో ఆర్జీవీ మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ? అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. Read Also : బ్రేకింగ్ : “రాధేశ్యామ్”…
ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. నిన్నటి నుంచి సినిమా ఇండస్ట్రీ తరపున ఆర్జీవీ, ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్జీవీ ప్రభుత్వానికి ప్రశ్నలతో ముంచెత్తుతుంటే, నాని కూడా తగ్గేదే లే అన్నట్టుగా సమాధానాలతో పాటు మరిన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. వీరిద్దరి మధ్య సాగుతున్న ట్విట్టర్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని వంటి కొంతమంది హీరోలు…