సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పుడు నక్సలైట్ గా కొత్త అవతారం ఎత్తారు. ‘కొండా’ వ్రాప్ అప్ పార్టీలో ఆయన హల్చల్, చేయగా దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా ‘కొండా’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు.…
కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ఇప్పుడు మరోసారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచం మొత్తం భయాందోళనలను సృష్టించింది. తాజాగా బయటపడిన మరో వేరియంట్ డెల్మిక్రాన్ హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ప్రజలను జాగ్రత్తగా ఉండమని కోరుతూ, మరోమారు లాక్ డౌన్ పరిస్థితులు రాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అయితే కొంతమంది ఇంకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకోలేదు. అది తీసుకుంటే కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా తగ్గుతుందనేది వైద్యుల సలహా.…
తెలంగాణ రక్త చరిత్రను ‘కొండా’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొంతకాలం నక్సలిజం నీడలో గడిపి, ఆపైన రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజానాయకుడిగా ఎదిగిన కొండా మురళీ జీవన ప్రయాణం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అదిత్ అరుణ్, ఇరా మోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘కొండా’ షూటింగ్ ను కొద్ది రోజుల క్రితం వరంగల్ లో మొదలు పెట్టారు. అయితే ఊహించని ఇబ్బందుల కారణంగా అక్కడ పూర్తి స్థాయిలో షెడ్యూల్…
విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ఇప్పుడో మలయాళ చిత్రంలో నటిస్తోంది. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్ స్టర్ ‘ అనే మూవీలో మంచు లక్ష్మీది చాలా కీలకమైన పాత్ర. అందుకోసం ప్రత్యేకంగా కేరళకు చెందిన అతి పురాతన యుద్థకళ కలరిపయట్టు ను రాత్రీ పగలూ తేడా లేకుండా ప్రాక్టీస్ చేస్తోంది. విశేషం ఏమంటే… రెండు రోజుల క్రితం మంచు లక్ష్మీ ఈ యుద్థకళను ప్రాక్టీస్ చేస్తున్న చిన్నపాటి వీడియోను ఇన్ స్టాగ్రామ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టాలీవుడ్లో భయం లేని హీరో అంటే అల్లు అర్జున్ అంటూ ఆర్జీవీ పేర్కొన్నాడు. రీసెంట్గా విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్ను చూసి ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పుష్ప లాంటి పాత్రలు బన్నీ కాకుండా మరెవరూ చేయలేరన్నాడు. రియలిస్టిక్ పాత్రలు చేయాలంటే అల్లు అర్జున్ మాత్రమే పర్ఫెక్ట్ అని ఆర్జీవీ కొనియాడాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, మహేష్…
‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆయనతో అనుభందం ఉన్నవారందరూ ఆయనను చివరిచూపు చూసి ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక తాజాగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ట్విట్టర్ ద్వారా తనదైన రీతిలో స్పందించాడు. ఆడియో ద్వారా ఆయన మాట్లాడుతూ..” సిరివెన్నెల ను నేను అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదటిసారి కలిశాను. శివ సినిమా కు ఒక మంచి కాలేజ్…
లక్షలాది మంది అభిమానులను, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తూ లెజెండరీ గేయ రచయిత పద్మశ్రీ చెంబోలు సీతారామశాస్త్రి 66 ఏళ్ళ వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం (నవంబర్ 30) సాయంత్రం 4:07 గంటలకు తుది శ్వాస విడిచారు. నవంబరు 24న న్యుమోనియా కారణంగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల భౌతికకాయాన్ని అభిమానులు, సినీ పరిశ్రమ శ్రేయోభిలాషుల కోసం ఈరోజు ఉదయం 7 గంటలకు…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మనసులో ఏది దాచుకోడు. మంచైనా .. చెడైనా మొహం మీద కొట్టినట్లు మాట్లాడతాడు. ఆయనకు ఓ పట్టనా మనుషులు నచ్చరు.. ఇక రాజకీయాల పరంగా అయితే టీడీపీని , జనసేనను ఏకిపారేస్తున్న విషయం తెలిసిందే. అయితే వర్మ ఎప్పుడు, ఎక్కడ ఏపీ సీఎం జగన్ ని విమర్శించడం కానీ, కామెడీ చేయడం కానీ, కౌంటర్లు వేయడం కానీ చేయలేదు. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ ఓపెన్ అయ్యాడు.…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదం ఎక్కడ ఉంటె అక్కడ నేను ఉన్నాను అంటూ గుర్తుచేస్తాడు. ఈరోజు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటన ఇరు రాష్ట్రాలలోను సంచలనంగా మారింది. ఇక తాజాగా ఈ ఘటనపై ఆర్జీవీ తనదైన రీతిలో స్పందించాడు. చంద్రబాబు ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ తన సినిమా ట్రైలర్ రియాక్షన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈరోజు పవర్ స్టార్/ ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ విడుదల అయినా…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలో ‘పవర్ స్టార్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమానే ‘పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ట్రైలర్ మొత్తం రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం మద్యంలో వర్మ కిడ్నాప్ అవ్వడం.. దానివలన జరిగే పరిణామాలు ఏంటి అనేది చూపించాడు. ఒక్క సీటు కూడా రాలేదా అంటూ ప్రవన్…