Home
Rajnath Singh
Rajnath Singh News
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
Agni Missile: భారత అణ్వాస్త్ర సామర్థ్యం మరింత బలపడింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) వ్యవస్థతో కూడిన అడ్వాన్స్డ్ అగ్ని క్షిపణిని భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ టెక్నాలజీ ద్వారా క్షిపణి ఒకేసారి అనేక లక్ష్యాలపై వేర్వేరు ప్రాంతాల్లో ఖచ్చితమైన దాడులు చేయగలదు. -
Rajnath Singh: ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలి..
Rajnath Singh: పాకిస్తాన్కు భారత్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్ తమపై దాడి చేస్తే, ఈసారి కోల్కతాపై దాడులు చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. అయితే, ఈయన వ్యాఖ్యలకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. మరోసారి, పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే, ఆ దేశం ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలన్నారు. Read Also: Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్.. నూనె… -
Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..
TMC: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఇప్పుడు, పాకిస్తాన్ కేంద్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మరోసారి భారత్ దాడి చేస్తే, కోల్కతాపై దాడులు చేస్తామని పాకిస్తాన్ బలుపు మాటలు మాట్లాడుతోంది. ఈ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ విరుచుకుపడ్డారు. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్… -
Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..
Pakistan: గతేడాది జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్ని పాకిస్తాన్ మర్చిపోయినట్లుంది, అందుకే భారత్ను ఉద్దేశించి అవాకులు చెవాకులు పేలుతోంది. గురువారం, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం నీడలో పాకిస్తాన్ భారత్పై కుట్ర పన్నినా, ఏదైనా దుస్సాహసానికి దిగినా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కేవలం 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి వచ్చిన సంగతిని గుర్తు చేశారు. Read Also: Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్… -
Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..
Rajnath Singh: ఇరాన్ యుద్ధం నీడలో ఎలాంటి ‘‘దుస్సాహసానికి’’ పాల్పడొద్దని పాకిస్తాన్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఏడాది పూర్తవుతున్న కొద్ది రోజుల ముందు ఆయన నుంచి ఈ వార్నింగ్ వచ్చింది. కేరళలో జరుగుతున్న సైనిక్ సమ్మాన్ సమ్మేళనంలో రాజ్నాథ్ మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలోని అశాంతిని అవకాశంగా తీసుకుని పాకిస్థాన్ అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే, భారతదేశం యొక్క ప్రతిస్పందన “నిర్ణయాత్మకంగా” ఉంటుందని అన్నారు. Read Also: Iran: ‘‘మా భారత మిత్రులు… -
S-400 missile system: ఎస్-400తో సహా భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు కేంద్రం ఓకే..
S-400 missile system: దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు ఓకే చెప్పింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశంలో రూ. 2.38 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ కొనుగోలు భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో… -
Rafale Deal: 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం ఆమోదం..
Rafale Deal: ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) గురువారం 114 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఓకే చెప్పింది. ఈ డీల్తో భారత వైమానికదళం సామర్థ్యం మరింత పెరుగుతుంది. -
Solid Fuel Ducted Ramjet: SFDR టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించిన DRDO..(వీడియో)
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఫిబ్రవరి 3, 2026 మంగళవారం నాడు ఒడిశా తీరంలో ఉన్న చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ (SFDR) టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయవంతమైన ప్రదర్శనతో, భారతదేశం ఈ సాంకేతికతను కలిగి ఉన్న ఎంపిక చేయబడిన దేశాల సమూహంలో చేరింది. ఇది దీర్ఘ-శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల అభివృద్ధిని అనుమతిస్తుంది. ప్రత్యర్థులపై వ్యూహాత్మక విజయాన్ని అందిస్తుంది. Also Read:India-US Trade deal:… -
Parliament Budget Session: లోక్సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్..
విపక్ష సభ్యులు సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేశారు. దీంతో 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్సభ సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘటన జరిగింది. సస్పెండ్ అయిన 8 మంది ఎంపీల్లో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, ఎబి ఈడెన్, కిరెన్ రెడ్డి, వెంకట్ రామన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. స్పీకర్ ఈ సంఘటనను… -
Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్ కు అత్యాధునిక స్వదేశీ నౌక.. ‘సముద్ర ప్రతాప్’ ప్రారంభానికి సిద్ధం
భారత కోస్ట్ గార్డ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జనవరి 5న సైన్యంలోకి ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఈ నౌకలో అధునాతన ఆయిల్ స్పిల్ డిటెక్షన్ సిస్టమ్ అమర్చబడి ఉన్నాయి. ఇవి ప్రత్యేక ఎకనామిక్ కౌన్సిల్ లోపల, వెలుపల సమగ్ర కాలుష్య నిరోధక కార్యకలాపాలను నిర్వహించడంలో సహాయపడతాయి. Also Read:Krishna: అవనిగడ్డలో 45 రోజుల పసిపాప…
తాజావార్తలు
-
Manchu Manoj: మనోజ్కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
-
Mamitha Baiju: చేస్తే అలాంటి సినిమాలే చేయాలి..మమితా బైజు ఎమోషనల్ కామెంట్స్!
-
Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
-
New Labor Laws India: వారానికి 4 రోజులే పని.. 3 రోజులు సెలవులు! కానీ కండిషన్స్ అప్లై..
-
Saroj Khan: మాధురీని ఉదాహరణగా చూపిస్తూ.. కరిష్మాపై ఫైర్ అయిన సరోజ్ ఖాన్..
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?