Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత వైమానిక దళంలో చేరబోతున్న యువ అధికారులకు అభినందనలు తెలియజేస్తూ దేశ రక్షణలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 245 మంది క్యాడెట్లకు రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వియత్నాంకు చెందిన విదేశీ క్యాడెట్లను కూడా ప్రత్యేకంగా అభినందించారు. భారత ఎయిర్ఫోర్స్ అకాడమీ విదేశీ విద్యార్థులకు సైతం శిక్షణ అందించడం దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. భారత వైమానిక దళ చరిత్రను ప్రస్తావిస్తూ.. 1947-48లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ఎయిర్ఫోర్స్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అలాగే 1971 యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే విజయం సాధించడంలో భారత వైమానిక దళం పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఎయిర్ఫోర్స్లో మీరు అడుగుపెడుతున్నారని క్యాడెట్లకు చెప్పారు.
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ప్రస్తుతం యుద్ధాల స్వరూపం పూర్తిగా మారిపోయిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధాలు, రాడార్లకు కూడా చిక్కకుండా దాడులు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సైనికాధికారులకు ఎంతో అవసరమని చెప్పారు. సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని యువ అధికారులకు సూచించారు. ఇటీవల నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సందర్భంగా భారత వైమానిక దళం ప్రదర్శించిన ధైర్యసాహసాలు, తెగువను ఆదర్శంగా తీసుకోవాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్థంగా పనిచేసే స్ఫూర్తిని అలవరుచుకోవాలని సూచించారు.
భారత ఎయిర్ఫోర్స్ అకాడమీ కేవలం సైనిక శిక్షణకే పరిమితం కాకుండా.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాలకు పరిచయం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. విదేశీ క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా భారత దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళంలో కమిషన్ పొందబోతున్న మహిళా క్యాడెట్లను రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఎయిర్ఫోర్స్లో వారి ప్రవేశం “నారీ శక్తి”కి నిదర్శనమని కొనియాడారు. దేశ రక్షణలో మహిళల భాగస్వామ్యం మరింత బలపడుతోందని ఆయన అన్నారు. క్యాడెట్లందరూ తమ శిక్షణను దేశ సేవకు అంకితం చేసి, భారత వైమానిక దళ గొప్ప సంప్రదాయాలను కొనసాగించాలని రాజ్నాథ్ సింగ్ ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!