Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత వైమానిక దళంలో చేరబోతున్న యువ అధికారులకు అభినందనలు తెలియజేస్తూ దేశ రక్షణలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 245 మంది క్యాడెట్లకు రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వియత్నాంకు చెందిన విదేశీ క్యాడెట్లను కూడా ప్రత్యేకంగా అభినందించారు. భారత ఎయిర్ఫోర్స్ అకాడమీ విదేశీ విద్యార్థులకు సైతం శిక్షణ అందించడం దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. భారత వైమానిక దళ చరిత్రను ప్రస్తావిస్తూ.. 1947-48లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ఎయిర్ఫోర్స్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అలాగే 1971 యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే విజయం సాధించడంలో భారత వైమానిక దళం పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఎయిర్ఫోర్స్లో మీరు అడుగుపెడుతున్నారని క్యాడెట్లకు చెప్పారు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ప్రస్తుతం యుద్ధాల స్వరూపం పూర్తిగా మారిపోయిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధాలు, రాడార్లకు కూడా చిక్కకుండా దాడులు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సైనికాధికారులకు ఎంతో అవసరమని చెప్పారు. సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని యువ అధికారులకు సూచించారు. ఇటీవల నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సందర్భంగా భారత వైమానిక దళం ప్రదర్శించిన ధైర్యసాహసాలు, తెగువను ఆదర్శంగా తీసుకోవాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్థంగా పనిచేసే స్ఫూర్తిని అలవరుచుకోవాలని సూచించారు.
భారత ఎయిర్ఫోర్స్ అకాడమీ కేవలం సైనిక శిక్షణకే పరిమితం కాకుండా.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాలకు పరిచయం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. విదేశీ క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా భారత దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళంలో కమిషన్ పొందబోతున్న మహిళా క్యాడెట్లను రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఎయిర్ఫోర్స్లో వారి ప్రవేశం “నారీ శక్తి”కి నిదర్శనమని కొనియాడారు. దేశ రక్షణలో మహిళల భాగస్వామ్యం మరింత బలపడుతోందని ఆయన అన్నారు. క్యాడెట్లందరూ తమ శిక్షణను దేశ సేవకు అంకితం చేసి, భారత వైమానిక దళ గొప్ప సంప్రదాయాలను కొనసాగించాలని రాజ్నాథ్ సింగ్ ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!