రాజస్థాన్లోని అల్వార్లో హిందూ విద్యార్థులు తమ నుదుటిపై తిలకం పెట్టడాన్ని ప్రభుత్వ పాఠశాలలో కొందరు ముస్లిం విద్యార్థులు అభ్యంతరం చెప్పడంతో రెండు వర్గాల సభ్యులు గురువారం ఘర్షణకు దిగారు. చోమ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఘర్షణకు దిగారు.
రాజస్థాన్ అసెంబ్లీలో రెడ్ డైరీ కలకలం లేపింది. రెడ్ డైరీలో అంశాలపై చర్చించాలని పట్టుపట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే రాజేంద్ర గుడాను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.
ఈ మధ్య కాలంలో చాలామంది యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. కేవలం ఆసక్తి మాత్రమే కాదు.. అందుకున్నది సాధిస్తున్నారు.. లక్షలు సంపాదిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. సంప్రదాయ పంటల కన్నా ఎక్కువగా ఔషద పంటలను ఎక్కువగా పండిస్తున్నారు.. వాటితో ఎక్కువ లాభాలను పొందుతూన్నారు..ఇప్పుడు మనం చెప్పుకొనే యువ రైతు ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి కలబంద సాగు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.. ఇక ఆ రైతు గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. రైతుగా…
ప్రధాని నరేంద్ర మోడీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా విమర్శించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జరిగే చివరి సెషన్లో రాజస్థాన్ అసెంబ్లీ ఈ రోజు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల పని హామీనిచ్చే మైలురాయి బిల్లును ఆమోదించింది. వృద్ధులు, ప్రత్యేక వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు కనీసం రూ.1,000 పెన్షన్కు కూడా ఈ బిల్లు హామీ ఇస్తుంది.
Earthquake in Jaipur: రాజస్థాన్లోని జైపూర్లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో 3 సార్లు భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత 4.4గా రిక్టర్ స్కేలుపై నమోదైంది.
రాజస్థాన్లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు 'రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023'. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది.
అక్రమ సంబంధాలు జీవితాలను నాశనం చేస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో దారుణ ఘటనలను చూస్తూనే ఉన్నాం..తాజాగా ఓ వివాహేతర సంబంధం మనిషి ప్రాణాన్ని తీసింది.. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది..రాజస్థాన్ లోని పాలిలో 33 ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రేమికుడు హత్య చేసి, మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టాడు. శరీరభాగాలను ఖననం చేసిన స్థలంలో నిందితుడు మామిడి మొక్కను నాటినట్లు పోలీసులు తెలిపారు. జోగేంద్ర అనే వ్యక్తిని…
రాజస్థాన్లో దారుణ ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమె మీద యాసిడ్ దాడి చేశారు. ఆ తరువాత ఆమె మృతదేహం ఓ బావిలో దొరికింది. ఈ ఘటన రాజస్థాన్లో కరౌలీ జిల్లాలో జరిగింది.