Hindu Boy Thrashed: నుదుటిపై తిలకం పెట్టుకున్నాడని హిందూ విద్యార్థిపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Boy Thrashed: రాజస్థాన్లోని అల్వార్లో హిందూ విద్యార్థులు తమ నుదుటిపై తిలకం పెట్టడాన్ని ప్రభుత్వ పాఠశాలలో కొందరు ముస్లిం విద్యార్థులు అభ్యంతరం చెప్పడంతో రెండు వర్గాల సభ్యులు గురువారం ఘర్షణకు దిగారు. చోమ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఘర్షణకు దిగారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11వ తరగతి చదువుతున్న శుభమ్ రాజ్పుత్ అనే విద్యార్థి నుదుటిపై తిలకం పెట్టుకుని పాఠశాలకు చేరుకున్నాడు. కొంతమంది ముస్లిం విద్యార్థులు అతనిపై దాడి చేసి బెదిరించారు, ఆ తర్వాత రెండు వర్గాలకు చెందిన దాదాపు 500 మంది పాఠశాల వెలుపల గుమిగూడారు. అనంతరం శుభం తల్లిదండ్రులు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలు చేశారు.ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మరింత పెరగకుండా ఉండేందుకు గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
Also Read
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
Also Read: Indigo Tail Strikes: ఇండిగోకు రూ.30 లక్షల జరిమానా.. ఎందుకంటే?
అల్వార్లో తిలకం కేసు ఎలా మొదలైంది?
జూలై 25న రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కొందరు ముస్లిం విద్యార్థులు హిందూ విద్యార్థి నుదుటిపై తిలకం పెట్టడాన్ని వ్యతిరేకించారు.మరుసటి రోజు, అనేక మంది ఇతర హిందూ విద్యార్థులు పాఠశాలలో తిలకంతో కనిపించారు. దీంతో వాగ్వాదం జరిగి ప్రధానోపాధ్యాయుడు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత జూలై 27న (గురువారం) శుభమ్ రాజ్పుత్కి, కొంతమంది ముస్లిం విద్యార్థులకు తిలకం విషయంలో గొడవ జరిగింది. పాఠశాలలో తిలకంతో కనిపించిన శుభమ్ను ముస్లిం సమాజానికి చెందిన దాదాపు ఎనిమిది మంది అబ్బాయిలు బెదిరించారు, వారు తిలకం తొలగించాలని లేదా పరిణామాలను ఎదుర్కోవాలని శుభమ్ని కోరారు.శుభం ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. ఆ బృందం అతనిపై దాడి చేసి బలవంతంగా తిలకం తొలగించినట్లు సమాచారం.
Also Read: Viral Video: ఇన్స్టాగ్రామ్ రీల్కు పోజులిస్తుండగా జలపాతంలో జారిపడ్డాడు.. వీడియో వైరల్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముస్లిం కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు కూడా అతని కుటుంబంతో పాటు ఇస్లాం మతంలోకి మారాలని శుభమ్ను కోరారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న శుభం తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. అయితే, వారిని కూడా మతం మార్చుకోవాలని చెప్పారని, అలా చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అనంతరం గురువారం శుభమ్ తల్లిదండ్రులు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టారు. కాగా, ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత జే అహుజా ఆరోపించారు. ఈ మొత్తం ఘటనను ఖండిస్తూ.. శుభమ్ కుటుంబానికి న్యాయం చేయకుంటే ఆందోళనలు చేస్తామని అహూజా హెచ్చరించారు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!