Hindu Boy Thrashed: నుదుటిపై తిలకం పెట్టుకున్నాడని హిందూ విద్యార్థిపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Boy Thrashed: రాజస్థాన్లోని అల్వార్లో హిందూ విద్యార్థులు తమ నుదుటిపై తిలకం పెట్టడాన్ని ప్రభుత్వ పాఠశాలలో కొందరు ముస్లిం విద్యార్థులు అభ్యంతరం చెప్పడంతో రెండు వర్గాల సభ్యులు గురువారం ఘర్షణకు దిగారు. చోమ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఘర్షణకు దిగారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11వ తరగతి చదువుతున్న శుభమ్ రాజ్పుత్ అనే విద్యార్థి నుదుటిపై తిలకం పెట్టుకుని పాఠశాలకు చేరుకున్నాడు. కొంతమంది ముస్లిం విద్యార్థులు అతనిపై దాడి చేసి బెదిరించారు, ఆ తర్వాత రెండు వర్గాలకు చెందిన దాదాపు 500 మంది పాఠశాల వెలుపల గుమిగూడారు. అనంతరం శుభం తల్లిదండ్రులు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలు చేశారు.ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మరింత పెరగకుండా ఉండేందుకు గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Also Read: Indigo Tail Strikes: ఇండిగోకు రూ.30 లక్షల జరిమానా.. ఎందుకంటే?
అల్వార్లో తిలకం కేసు ఎలా మొదలైంది?
జూలై 25న రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కొందరు ముస్లిం విద్యార్థులు హిందూ విద్యార్థి నుదుటిపై తిలకం పెట్టడాన్ని వ్యతిరేకించారు.మరుసటి రోజు, అనేక మంది ఇతర హిందూ విద్యార్థులు పాఠశాలలో తిలకంతో కనిపించారు. దీంతో వాగ్వాదం జరిగి ప్రధానోపాధ్యాయుడు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత జూలై 27న (గురువారం) శుభమ్ రాజ్పుత్కి, కొంతమంది ముస్లిం విద్యార్థులకు తిలకం విషయంలో గొడవ జరిగింది. పాఠశాలలో తిలకంతో కనిపించిన శుభమ్ను ముస్లిం సమాజానికి చెందిన దాదాపు ఎనిమిది మంది అబ్బాయిలు బెదిరించారు, వారు తిలకం తొలగించాలని లేదా పరిణామాలను ఎదుర్కోవాలని శుభమ్ని కోరారు.శుభం ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. ఆ బృందం అతనిపై దాడి చేసి బలవంతంగా తిలకం తొలగించినట్లు సమాచారం.
Also Read: Viral Video: ఇన్స్టాగ్రామ్ రీల్కు పోజులిస్తుండగా జలపాతంలో జారిపడ్డాడు.. వీడియో వైరల్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముస్లిం కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు కూడా అతని కుటుంబంతో పాటు ఇస్లాం మతంలోకి మారాలని శుభమ్ను కోరారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న శుభం తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. అయితే, వారిని కూడా మతం మార్చుకోవాలని చెప్పారని, అలా చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అనంతరం గురువారం శుభమ్ తల్లిదండ్రులు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టారు. కాగా, ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత జే అహుజా ఆరోపించారు. ఈ మొత్తం ఘటనను ఖండిస్తూ.. శుభమ్ కుటుంబానికి న్యాయం చేయకుంటే ఆందోళనలు చేస్తామని అహూజా హెచ్చరించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!