Mamata Banerjee: కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ పీజీ మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా మెడికోలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీపై ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం పార్టీలు
INDIA Alliance: కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యంత పాశవికంగా 31 ఏళ్ల మహిళా వైద్యురాలిపై అత్యాచారం జరిగింది. నైట్ డ్యూటీ సమయంలో ఆమెపై ఈ దారుణం జరిగింది.
Rahul Gandhi: కోల్కతా వైద్యురాలి అత్యచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ నేతలు మెల్లిగా స్పందిస్తున్నారు. ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించిన ఒక రోజు తర్వాత ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సుతిమెత్తగా విమర్శలు చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రధాని కాలేదన్న నిరాశలో దేశ ఆర్థిక పరిస్థితిని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
Rahul Gandhi: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ మరోసారి తన నివేదికతో భారత్లో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. సెబీ చైర్పర్సర్ మధాబీ పూరి భుచ్పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే, దీనిపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా విమర్శలు ఎక్కుపెట్టారు.
Rahul Gandhi: కొండచరియలు విరిగిపడటం వల్ల కేరళలోని వయనాడ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఈ విషాద ఘటనలో 400 మంది కన్నా ఎక్కువ ప్రజలు మరణించారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
Anurag Thakur: బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. పాలస్తీనా, గాజా పట్ల ఆందోళన చెందే కాంగ్రెస్ పార్టీ, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నప్పుడు రాహుల్ గాంధీ నిద్రపోతున్నారని అధికార పార్టీ వాదిస్తోంది.
అనేక రోజుల రాజకీయ గందరగోళం తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. దేశంలోని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.