వైసీపీ నేతల మధ్య ఆధిపత్యపోరు పెరిగిపోతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల మధ్య చీలిక.. విమర్శ, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. వైఎస్సార్ పెన్షన్ కానుక సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. ఈ నెల 2న తణుకులో వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభించారు MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్ర నాధ్, తణుకు వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ తమ్ముడు సాయి రాం రెడ్డి. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు…
తూర్పుగోదావరి జిల్లాలో ఓ వైసీపీ నేత ఓ మహిళా ఉద్యోగి పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఛాంబర్ లోనే ఒక దళిత ఎంపీడీవో పై ఏకవచనంతో రెచ్చిపోయారు నేదునూరు పెదపాలెం మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు వాసంశెట్టి తాతాజీ. ఎంపీడీవో నచ్చకపోతే పంపించేయండి అని అంటే సరిగ్గా చేయకపోతే చీరేస్తానని వైసీపీ నాయకుడు బెదిరించడం కలకలం రేపుతోంది. కె.జగన్నాధపురం గ్రామంలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు, స్థానిక జడ్పీటీసీ ప్రొటోకాల్…
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రోటోకాల్ రగడ నడుస్తోంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కి షాకిచ్చారు వీరవాసరం మండలంలోని జనసేన నేతలు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో అంగన్ వాడీ బిల్డింగ్ , సొసైటీ గౌడౌన్ ప్రారంభోత్సవం చేయాల్సి వుంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ పాటించలేదు. జనసేనకు చెందిన సర్పంచ్, జెడ్పీటీసీకి ఆహ్వానం పంపలేదు. దీంతో వైసీపీ భీమవరం ఎమ్మెల్యే రాకముందే అంగన్ వాడీ, సొసైటీ గౌడౌన్ లను ప్రారంభించారు జనసేన ZPTC…