పీఆర్సీ అమలు కోసం గత కొన్ని నెలలుగా ఎరుదుచూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించడంతో.. ఇక త్వరలోనే అమలు అవుతాయని.. జీతాలు పెరుగుతాయని అంతా ఎదురుచూస్తూ వచ్చారు.. అయితే, ఉప ఎన్నికలు, మరికొన్ని కారణాలతో పీఆర్సీ అమలు వాయిదా పడుతూవచ్చింది. కానీ, రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో దానికి మోక్షం లభించే అవకాశం ఉంది.. రేపటి కేబిట్ సమావేశంలో పీఆర్సీపై చర్చించనున్నారు.. ఉద్యోగుల వేతన సవరణ పూర్తి నివేదికను…
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా నిరాశ తప్పేలా లేదు.. పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా.. కొన్ని రోజులు ఎన్నికల కోడు.. ఆ తర్వాత జాప్యం.. ఇలా అమలుకు నోచుకోవడం లేదు.. ఈ నెల కూడా పీఆర్సీ అమలు లేనట్టే కనిపిస్తోంది.. ఉద్యోగులకు మే నెల కూడా పాత జీతాలే రానున్నాయని చెబుతున్నారు.. ఏప్రిల్ ఒకటి నుండి కొత్త పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. కరోనా వైరస్ విజృంభణ, ఇతర కారణాలతో…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతన సవరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీలో ప్రకటన చేశారు. అంతేకాకుండా మే 1వ తేదీన పొందే ఏప్రిల్ నెల వేతనాలు నూతన పిఆర్సీ ప్రకారమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పొందుతారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఏప్రిల్ నెల ముగింపుకొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కాలేదు సరి కదా, ఇంతవరకు కూడా పిఆర్సీ పై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాలేదు. 1.07.2018…