New Electricity Bill: ఇన్నాళ్లు ప్రభుత్వమే మనకు విద్యుత్ అందించేది. ఇకపై వినియోగదారులు తమకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్ కనెక్షన్లు తీసుకునే అవకాశం వస్తోంది. మన మొబైల్ నెట్వర్క్లాగే, మనకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్ను కొనుగోలు చేయవచ్చు. ఒకరి సర్వీస్ బాగా లేకుంటే, మరో సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. ఎలాగైతే మనం ఒక నెట్వర్క్ నచ్చకుంటే, సిమ్ మార్చి వేరే నెట్వర్క్కు మారుతామే అచ్చం అలాగే.
కరోనా సమయంలో కరెంట్ వినియోగం తగ్గిపోయింది.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకవడంతో.. మళ్లీ అన్ని సంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి.. దీంతో.. విద్యుత్ డిమాండ్ పెరుగుతూ పోతోంది… ఇదే ఇప్పుడు సమస్యగా మారిపోతోంది… చైనా లాంటి దేశాలు కూడా విద్యుత్ సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి… ఇదే సమయంలో.. భారత్కు విద్యుత్ సంక్షోభం తప్పదనే హెచ్చరికలున్నాయి.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. దేశంలోని థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచుతామని.. సంక్షోభాన్ని తప్పిస్తామని అందులో స్పష్టంచేసింది…