New Electricity Bill: ఇక “కరెంట్” కొనుగోలు మీ ఇష్టం.. విద్యుత్ మార్కెట్లోకి ప్రైవేట్ కంపెనీలు..
- ఇక మీ కరెంట్ మీ ఇష్టం..
- నచ్చిన సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం..
- ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం..
- కొత్తగా ఎలక్ట్రిసిటీ బిల్లును తీసుకువస్తున్న కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Electricity Bill: ఇన్నాళ్లు ప్రభుత్వమే మనకు విద్యుత్ అందించేది. ఇకపై వినియోగదారులు తమకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్ కనెక్షన్లు తీసుకునే అవకాశం వస్తోంది. మన మొబైల్ నెట్వర్క్లాగే, మనకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్ను కొనుగోలు చేయవచ్చు. ఒకరి సర్వీస్ బాగా లేకుంటే, మరో సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. ఎలాగైతే మనం ఒక నెట్వర్క్ నచ్చకుంటే, సిమ్ మార్చి వేరే నెట్వర్క్కు మారుతామే అచ్చం అలాగే.
కేంద్రం తీసుకురాబోతున్న కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లులో ఈ ప్రదిపాదనలు ఉన్నాయి. దీంతో, భారతదేశ వ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీల కోసం తన రిటైల్ విద్యుత్ మార్కెన్ను తెరవాలని కేంద్రం యోచిస్తోంది. ఈ చర్య ద్వారా కేంద్రం చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ నిర్వహణ పంపిణీదారుల ఆధిపత్యాన్ని అంతం చేయాలని చూస్తోంది. దీని ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా పవర్, టోరెంట్ పవర్, CESC వంటి ప్రైవేట్ కంపెనీలు దేశవ్యాప్తంగా తమ విద్యుత్ను అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది.
Also Read
Read Also: BJP MLA: “హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లొద్దు, ఇంట్లో యోగా చేయాలి..”
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత శుక్రవారం ముసాయిదా బిల్లును రాష్ట్రాలకు పంపింది. అయితే, దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. కాబట్టి అవన్నీ ఎలాగూ ఒకే చెబుతాయి. 2022లో ఇలాంటి ప్రయత్నాలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు వ్యతిరేకించాయి. ప్రస్తుతం, ఢిల్లీ ఎన్సీఆర్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలతో సహా దేశంలోని కొన్ని ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ జోన్లు ప్రైవేటీకరించారు.
నష్టాలను తగ్గించడానికి, పురాతన మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి కేంద్రం విద్యుత్ సంస్థలపై ఒత్తిడి తెస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ తన నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల్లో రెండింటిని ప్రైవేటీకరించడానికి బిడ్లను ఆహ్వానించింది. జూన్ 2025 నాటికి, రాష్ట్ర విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తిదారులకు 6.78 బిలియన్ డాలర్లను బకాయిపడినట్లు, దీని వల్ల విద్యుత్ ఉత్పత్తిదారులు తీవ్రమైన ద్రవ్యకొరత ఎదుర్కొంటున్నట్లు, దీని వల్ల ఈ రంగానికి క్రెడిట్ ప్రవాహాలు తగ్గిపోతున్నట్లు ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ సెప్టెంబర్లో తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!