Kerala: కేరళ రాజధాని తిరువనంతపురం తూర్పు కోటలో ఉన్న శ్రీ పద్మనాథ స్వామి ఆలయానికి సంబంధించి కీలక సమాచారం వెలువడింది. ఆలయంలో ఇటీవల బంగారం మాయమైన విషయం తెలిసిందే. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే బంగారం దొరికింది. గోల్డ్ దొరికినప్పటికీ ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారు పూత కోసం గోల్డ్ నాణేలను తీశారు. ఆ సమయంలో స్ట్రాంగ్ రూమ్లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని దర్యాప్తులో తేలింది.
కోల్కతా అత్యాచార హత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్యపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ మరణించిన రోజున ఓ జూనియర్ డాక్టర్ ఛాతీ ఔషధాల విభాగంలోని కూల్చివేసిన బాత్రూమ్లో స్నానం చేసినట్లు వెల్లడించింది.
కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్షలో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. పరీక్ష సమయంలో, సంజయ్ రాయ్ తనని ఇరికించారని, తాను హత్య చేయలేదని చెప్పాడు.
సీఎం మమతా బెనర్జీ, కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్లకు సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని పోలీసు కమిషనర్ మొదట చెప్పారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
Polygraph Test: కోల్కతాలో ఆర్జీ కార్ హస్పటల్ జూనియర్ డాక్టర్ ని హత్యాచారం చేసిన కేసులో.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. కోల్కతా పోలీసు శాఖలో సివిల్ వాలంటీర్గా అతను వర్క్ చేస్తున్నాడు. అయితే, సీబీఐకి ఇచ్చిన లై డిటెక్టర్ పరీక్షలో నిందితుడు సంజయ్ కొన్ని కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తుంది.
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కోల్కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగికముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా గుర్తించారు.
RG Kar EX-Principal: కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆర్జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు పాలీగ్రాఫ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది.
రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకితా భండారీ హత్య కేసులో ప్రధాన నిందితుడు, బహిష్కరణకు గురైన బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యకు నిర్వహించిన నార్కో, పాలీగ్రాఫ్ పరీక్షలకు ఉత్తరాఖండ్లోని కోటద్వార్ ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఆమోదం తెలిపింది.