అందరూ ఊహించినట్లే జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ను పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బరిలోకి దించింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ అభ్యర్థిగా హర్భజన్ సింగ్ను ఆప్ ప్రకటించింది. ఈ మేరకు భజ్జీ.. సోమవారం ఛండీగఢ్లో నామినేషన్ దాఖలు చేశాడు. ఆప్ రాజ్యసభ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాడు. 2.దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది..…
పెగాసస్ విషయంలో టీడీపీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్పై హౌస్ కమిటీ వేసినా.. జ్యుడిషయరీ కమిటీ వేసినా.. సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే వైఎస్ వివేకా హత్య విషయంలో, ప.గో. జిల్లాలో కల్తీ మద్యం మరణాల విషయంలో వైసీపీ ప్రభుత్వం విచారణకు కమిటీ వేయగలదా అని ప్రశ్నించారు. పెగాసస్పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా లేదా అనే…
Telangana BJP Incharge Tarun Chugh Review Meetings Today and Tomorrow. తెలంగాణలో రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ఎన్నికలకు మందుగానే ప్రజల్లోకి వెళ్లి వాళ్లతో మమేకమవడం కోసం ప్రయత్నలు సాగిస్తున్నాయి. దానికి కేడర్లను, కార్యకర్తలను చైతన్య పరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన…
All Political Parties Preparing for Elections. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహ రచన చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు మైకుల ముందు మేమంటే మేము అంటూ.. మైకుల పగిలేలా స్పీచులు ఇచ్చిన నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ప్రత్యర్థులకు ఆలోచనలకు అందకుండా వ్యూహాలు రచించేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లతో పాటు ఇతర పార్టీలు ఉన్నా.. తారాస్థాయి పోరుమాత్రం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ల మధ్యనే ఉండబోతోంది. ఇటీవల చేసిన కొన్ని…
ఏపీలో ప్రస్తుతం కల్తీ మద్యం, కల్తీ సారాపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై మంత్రి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. పచ్చపార్టీ వాళ్లు లిక్కర్ బ్రాండ్లపై ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, గవర్నర్స్ రిజర్వ్ విస్కీ వంటి మద్యం బ్రాండ్లకు 2018 ఫిబ్రవరి 6న అప్పటి సీఎం చంద్రబాబే అనుమతులు ఇచ్చారని మంత్రి అప్పలరాజు గుర్తుచేశారు. భూమ్.. భూమ్ బీర్ కంపెనీకి 2019…
కర్నూలులో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ భేటీలో పలువురు బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పేందుకు వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఏపీపై ప్రత్యేక ప్రేమతో దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను కేంద్రం ఏపీకి ఇస్తోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీ…
1.చికెన్ ప్రియులకు ఇది చేదు వార్తే.. రోజురోజుకు చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. దీనితో నాన్ వెజ్ లేకుంటే ముద్దయిన దిగని వాళ్లకు చికెన్ కొనాలంటే జేబులు చిల్లవుతున్నాయి. విజయవాడలో కేజీ ధర రూ.306 చేరుకుంది. అలాగే హైదరాబాద్లో కూడా ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా కిలో చికెన్ ధర రూ.281కు పెరిగింది. ఫిబ్రవరి 7న కిలోరూ.185 ఉన్న ధర ఒక్కసారిగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.281లుగా విక్రయిస్తున్నారు. అయితే సరుకు తక్కువగా…
మెదక్ జిల్లా తూఫ్రాన్లో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్ర లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్టులకు హెల్త్ కార్డు తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు భూతాల ఉద్యమంలో భూములు పంచితే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని…
సీనియర్ నేతల మీటింగ్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్ అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మానవతా రాయ్, ఈరవర్తి అనిల్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, ఇలాంటి తరుణంలో కొంతమంది వల్ల పార్టీ లోఇబ్బందికరంగా మారిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లో విభజించు పాలించు లాగా చేస్తున్నారని, బ్రిటీష్ వాళ్ళు చేసిన పాలన లాగా చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి…
కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూజివీడు అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతలు గాంధీబొమ్మ సెంటర్లో శనివారం సాయంత్రం బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. దీంతో అక్కడకు వచ్చిన టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్తగా నూజివీడులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నూజివీడు గాంధీ బొమ్మ…