Nara Lokesh: పెగాసస్పై ఎలాంటి కమిటీలు వేసినా విచారణకు మేం సిద్ధం
పెగాసస్ విషయంలో టీడీపీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్పై హౌస్ కమిటీ వేసినా.. జ్యుడిషయరీ కమిటీ వేసినా.. సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే వైఎస్ వివేకా హత్య విషయంలో, ప.గో. జిల్లాలో కల్తీ మద్యం మరణాల విషయంలో వైసీపీ ప్రభుత్వం విచారణకు కమిటీ వేయగలదా అని ప్రశ్నించారు. పెగాసస్పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా లేదా అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదని లోకేష్ అన్నారు.
మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చారంటూ పెగాసస్ సాఫ్ట్వేర్పై అసెంబ్లీలో చర్చ చేపట్టారని.. ఐదురోజులుగా టీడీపీ మద్యం, కల్తీ సారా మరణాలపై పోరాడుతున్నా పట్టించుకోవడంలేదని నారా లోకేష్ ఆరోపించారు. సారా మరణాలను సీఎం జగన్ సహజ మరణాలుగా తీసిపారేయడం బాధాకరమని నారా లోకేష్ అన్నారు. ప.గో. జిల్లాలో కల్తీ సారా కారణంగా 42 మంది చనిపోయారని..ప్రజల ప్రాణాల కంటే పెగాసస్ పెద్ద సమస్యగా ప్రభుత్వానికి కనిపిస్తుందా అని ప్రశ్నించారు. అందుకే జగన్ మోహన్రెడ్డిని జగన్ మోసపురెడ్డి అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు అన్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సెప్షన్ అని వ్యాఖ్యానించారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
మండలి బిజినెస్ లేకుండానే పెగాసస్పై సభలో చర్చ పెట్టారని విమర్శలు చేశారు. పెగాసెస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు రిప్లై ఇచ్చారని.. వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారని లోకేష్ వివరణ ఇచ్చారు. అయినా నిబంధనలకు విరుద్ధంగా సభలో పెగాసెస్ సాఫ్ట్వేర్పై స్వల్ప కాలిక చర్చకు మండలి ఛైర్మన్ అనుమతించారన్నారు. తాము మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు ఛైర్మన్ అనుమతించలేదని.. తప్పుడు సమాచారంతో సభలో పెగాసస్పై చర్చ పెట్టారని విమర్శించారు. ఏమన్నా అంటే 151 మంది ఉన్నారని అంటున్నారని.. భవిష్యత్లో వైసీపీకి 15 మంది కూడా ఉండని పరిస్థితి వస్తుందన్నారు. బాబాయ్ హత్య విషయంలోనూ అబద్దాలే ఆడారని.. డీఎస్పీ ప్రమోషన్ల విషయంలోనూ అబద్ధాలే చెప్తున్నారని లోకేష్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో