ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ముందు ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే ఘటనలను సహించకూడదని ప్రధాని స్పష్టం చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన నేడు రాజధాని సిడ్నీలో బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. విమానాల సహాయంతో ప్రధానికి స్వాగతం పలికేందుకు ఆకాశంలో 'వెల్కమ్ మోడీ' అని రాశారు.
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రచ్చ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధాని కాదని అన్నారు.
BJP : సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక సీఎం అయ్యారు. ఆయన శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొన్ని గంటల తర్వాత సిద్ధరామయ్య బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
PM Modi Japan Visit: జీ7 సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మోడీ జపాన్ వెళ్లారు. తొలిరోజు మోడీ బిజీబిజీగా గడిపారు. హిరోషిమాలో జాతి పిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జీ7 దేశాల సమావేశంలో పాల్గొని మోదీ ప్రసంగించారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతోనూ మోదీ సమావేశం అయ్యారు.
గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7), క్వాడ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సహా మూడు కీలక బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలలో ఆరు రోజుల పాటు పర్యటించనున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది.
కాంగ్రెస్ విజయం సాధించడంపై ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కర్ణాటక అభివృద్ధికి మా పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా ప్రకటించారు.
BREAKING NEWS: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలిసింది. జూన్ 22న ప్రధాని అమెరికా పర్యటకు వెళ్తారని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చే విందులో పాల్గొంటారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ పర్యటన అమెరికా, భారతదేశం మధ్య స్నేహబంధం మరింత పెరుగుతుందని, భారతీయులు, అమెరికన్ల స్నేహాన్ని ధృవీకరిస్తుందని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.