ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… అయితే, తొలిసారి ఈ ఘటనపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ… లఖింపూర్ ఖేరీ ఘటన జరిగిన 4 నెలల తర్వాత మొదటి సారి రైతుల హత్యలపై వ్యాఖ్యానించారు.. ఈ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అక్టోబర్ నుండి జైలులో ఉండగా.. అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ అతడిని హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగిస్తోంది నరేంద్ర మోడీ…
రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాద్దాంతం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? దేశంలో నరేంద్రమోడీ రాజ్యాంగం నడుస్తోంది అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆర్టికల్-3 ప్రకారమే ఏర్పడిందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ మోడీ తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థని, ఈసీని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆయన అన్నారు. మోడీ ఆడించినట్లు ఈ వ్యవస్థలు ఆడేలా చూస్తున్నారని ఆయన విమర్శించారు. పశ్చిమబెంగాల్లో గవర్నర్ను సీఎం బ్లాక్ చేసే…
రాష్ట్ర విభజనపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ప్రధావి మోడీవి పనికిమాలిన కూతలుగా పేర్కొన్న ఆయన.. దేశానికి ప్రధానిగా ఇలా మాట్లాడతారా ? అని నిలదీశారు… తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోడీ ఎనిమిదేళ్ళ క్రితం అన్నారని గుర్తుచేసిన కేటీఆర్.. ఇప్పుడు మళ్లీ అసందర్భంగా మాట్లాడారని దుయ్యబట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు.. ఇక, విగ్రహావిష్కరణ కోసం…
దేశానికి ప్రధాని స్థానంలో ఉన్న మోడీ.. బీజేపీ రథాన్ని ముందుండి లాగుతున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంది. అయితే ఈ సమయంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు వేదికగా ఉపయోగించుకొని.. మోడీ కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. కానీ.. ఆయన టార్గెట్ చేసిన కాంగ్రెస్ కు వినియోగించిన విల్లు ‘ఏపీ విభజన’. అయితే కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ.. మోడీ వదిలిన విభజన బాణం వ్యతిరేక పవనాలు వీయడంతో తిరిగి…
ప్రధాని మోడీ తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెనుదుమారం రేపుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ తెలంగాణకు పట్టిన శనిగ్రహం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ రూపంలో తెలంగాణను వెంటాడుతున్న భూతం అంటూ విమర్శించారు. కేసీఆర్ పథకాలతో ప్రధాని మోడీ వణికిపోతున్నారని, అందుకే పురిటీలోనే అణిచివేతకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిలువరించాల్సిన బాధ్యత యావత్ ప్రజానీకంపై ఉందని, అందుకు గులాబీ శ్రేణులు…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్…సబ్కా సాథ్ కాదు సబ్కా హాత్ అని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ను దుయ్యబట్టిన విజయసాయి రెడ్డి.. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ఈ బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్… కానీ పేషెంట్ డెడ్ అంటూ కేంద్రానికి చురకలు అంటించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ బడ్జెట్ అవుతుందేమోనని ఊహించామని, బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత ఇది ఏ రాష్ట్రానికి…
మోడీ తెలంగాణ ను అవమానించేలా మాట్లాడలేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాల పై మోడీ రాజ్య సభలో మాట్లాడారని, టీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సెంటిమెంటును రెచ్చగొట్టి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తుందని, అది జరగదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి అధికార ప్రతినిధిగా మారిందని, కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకునేందుకు అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలపై భౌతిక…
ప్రధాని మోడీ ఇటీవల పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ప్రధాని హైదరాబాద్కు వచ్చినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్కి జ్వరం ఉందని వెళ్లకపోతే అది మనసులో పెట్టుకుని తెలంగాణపై విషం కక్కుతున్నారని అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ దీనిని తీవ్ర పరిణామంగా తీసుకుని నిరసన తెలపాలని, కేసిఆర్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ వల్ల తనకు, తన…
మోడీ పార్లమెంట్లో అసభ్యకరంగా మాట్లాడాడని, పనికి మాలిన మాటలు చెప్పారని మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వాసం కల్పించాల్సిన వారు విద్వేషాలు రెచ్చగొట్టారని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి మాటలు మాట్లాడిన ప్రధాని లేరని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా చేవెళ్ల ప్రాణహిత కోసం జాతీయ హోదా ఇవ్వలేదని, రైతు చట్టాలను పోరాటాలు ద్వారా వెనక్కి తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్ధి…
కోవిడ్ -19 ఫస్ట్ వేవ్ సమయంలో ఆకస్మిక లాక్డౌన్ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వేలాది మంది వలస కార్మికులను క్లిష్టమైన కోవిడ్ పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం గాలికి వదిలివేసిందని ఆరోపించారు. కవిత తన ట్విట్టర్ హ్యాండిల్లో “కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించింది. ఇది మొత్తం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, గందరగోళానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని వలస కార్మికుల కష్టాలను కేసీఆర్ అర్థం చేసుకుని వారికి అండగా…