Prime Ministers Museum: ప్రధానుల మ్యూజియం… తొలి టికెట్ మోడీదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశ రాజకీయాల్లో ప్రధానమంత్రులది కీలక స్థానం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రుల మ్యూజియం ప్రారంభమయింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్కు ప్రధాన మంత్రులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించేలా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు.
ప్రతి యుగంలో, ప్రతి తరంలో ప్రజాస్వామ్యాన్ని మరింత సాధికారికంగా, ఆధునికంగా మార్చడానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. మారుమూల పల్లె నుంచి, పేదరికం నుంచి, రైతు కుటుంబం నుంచి ప్రధాని పదవిని అలంకరించడం.. భారత ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని బలపరుస్తోంది. దేశంలో ప్రతి ప్రధాని తమ హయాంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ.. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారన్నారు ప్రధాని మోడీ.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
తొలి పీఎం జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 14 మంది జీవిత విశేషాలు, వారు చేసిన సేవలు, సవాళ్లను ఎదుర్కొన్న తీరును ప్రధాన్మంత్రుల మ్యూజియంలో పొందుపర్చారు. దిల్లీ తీన్మూర్తి మార్గ్లోని నెహ్రూ మ్యూజియంలో ఏర్పాటైన దీనిని ప్రారంభించే ముందు.. ప్రధాని స్వయంగా టికెట్ కొని లోపలికి ప్రవేశించారు. మాజీ ప్రధానుల నాయకత్వ లక్షణాలు, ముందుచూపు, ఘనతలను.. ప్రస్తుత యువతరానికి తెలిపేలా చేయడమే దీని ఉద్దేశం అని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ దేశ 14 మాజీ ప్రధానమంత్రులకు ఈ మ్యూజియం అంకితం చేశారు. మన దేశ ప్రధానమంత్రులు అధిగమించిన వివరాలను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఈ మ్యూజియంలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జీవిత విశేషాలు, దేశ పురోగతికి ఆయన కృషికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పొందిన అనేక బహుమానాలను తొలిసారిగా ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంలో 43 గ్యాలరీలు ఉన్నాయి. హోలోగ్రామ్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మల్టీ టచ్, మల్టీ మీడియా, స్మార్ట్ఫోన్ అప్లికేషన్, ఇంటెరాక్టివ్ స్క్రీన్ వంటి నూతన సాంకేతికత సహాయంతో అందరినీ ఆకట్టుకోనున్నాయి.
దేశ యువతను, కొత్త తరాలను నాయకత్వం వైపు పురికొల్పేలా, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ప్రధాని మోడీ తీసుకున్న కీలక నిర్ణయంగా ఈ సంగ్రహాలయాన్ని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రుల నాయకత్వ, విజన్, వారి విజయాలపైనా అవగాహన పెంపొందించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించింది.
ఈ మ్యూజియం ఢిల్లీ మెట్రో స్టేషన్ ఎల్లో లైన్లోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో వుంది. ప్రధానమంత్రుల మ్యూజియం సందర్శించాలంటే టికెట్ కొనుగోలు చేయాలి. టికెట్లు ఆన్లైన్లో తీసుకుంటే రూ. 100, ఆఫ్లైన్లో తీసుకుంటే.. రూ. 110. విదేశీయులకు ఈ టికెట్ ధర రూ. 750. కాగా, విద్యార్థులకు టికెట్ రేట్లతో తగ్గింపు వుంది. స్కూల్, కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు టికెట్లు కొంటే 25 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఐదు నుంచి 12 ఏళ్ల పిల్లలకు టికెట్లపై 50 శాతం తగ్గింపు ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
తాజావార్తలు
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!