అసిమ్ మునీర్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్. భారత్పై నిత్యం విషం కక్కుతూ ఉంటాడు. విదేశాల్లో స్థిరపడిన పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది.
అగ్ర రాజ్యం అమెరికా-భారత్ మధ్య సుంకాల వార్ నడుస్తోంది. నిన్నామొన్నటిదాకా మంచి స్నేహ సంబంధాలు ఉన్న దేశాలు.. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్పై తొలుత 25 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ ఆపరేషన్ను కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మన పౌరులను బలి తీసుకున్న టెర్రరిస్టులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరగానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్పై మరోసారి ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, బెంగళూరులోని బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు..
CPI Narayana: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కటాక్షం లేకుంటే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు వెళ్లకుండా బయట ఉండటం సాధ్యం కాదన్నారు.
భారత్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టారిఫ్ల విషయంలో ఇరు దేశాల మధ్య సఖ్యత చెడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం హై-లెవల్ సమావేశానికి సిద్ధమయ్యారు.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోతున్నాయి. నిన్నామొన్నటిదాకా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
Kartavya Bhavan 3 Inaugurate: దేశ రాజధాని న్యూఢిల్లీలో అధికార పరిపాలనకు మౌలిక భద్రతను అందించేందుకు రూపొందించిన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణాల్లో ఒక్కటైన కర్తవ్య భవన్-3ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆగష్టు 6) అధికారికంగా ప్రారంభించారు. ఇది మొత్తంగా 10 భవనాల సముదాయ నిర్మాణం. ప్రస్తుతం ఢిల్లీలో విస్తరించి ఉన్న గృహ, విదేశాంగ, గ్రామీణాభివృద్ధి, సూక్ష్మ లఘు మధ్య పరిశ్రమలు (MSME), డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT), పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్,…
ఆపరేషన్ సిందూర్పై ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు ఎంతగానో బాధించిందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో ప్రధాని మోడీని ఘనంగా సత్కరించారు.