Modi-Trump: అమెరికాపై ప్రతీకార సుంకాలకు భారత్ రెడీ.. దెబ్బకు దెబ్బ కొట్టే ప్రణాళిక!
- అమెరికాపై ప్రతీకార సుంకాలకు భారత్ రెడీ
- దెబ్బకు దెబ్బ కొట్టే ప్రణాళిక!
- ఈనెలలోనే జరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికా-భారత్ మధ్య సుంకాల వార్ నడుస్తోంది. నిన్నామొన్నటిదాకా మంచి స్నేహ సంబంధాలు ఉన్న దేశాలు.. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్పై తొలుత 25 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. మొత్తంగా ఆసియా దేశాల్లో అత్యధికంగా భారత్పైనే సుంకం విధించారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ పరిమాణంపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. తమకు అన్నదాతలే ముఖ్యమని.. ఎంత టారిఫ్లైనా భరిస్తామంటూ తెలిపారు. రైతుల కోసం ఎక్కడా రాజీపడబోమని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీకి జెలెన్స్కీ ఆహ్వానం.. వైట్హౌస్ ఏం చెప్పిందంటే..!
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
అయితే తాజాగా అమెరికాపై ప్రతీకార సుంకాలకు భారత్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈనెలలోనే తొలి ప్రతీకార చర్య ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఎంపిక చేసిన అమెరికా వస్తువులపై సుంకాలు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సుంకాలపై తేలే వరకు భారత్తో ఎలాంటి చర్చలు ఉండవని ట్రంప్ తేల్చి చెప్పారు. చర్చలకు వాషింగ్టన్ ముందుకు రాకపోవడంతో ప్రతీకారం తీర్చుకోవడమే ముందున్న మార్గమని.. మరొక మార్గం లేదని విషయాలు తెలిసిన వ్యక్తి ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Vijay Devarakonda : కెరీర్ నాశనం చేసుకోవద్దంటు.. విజయ్కు ఫ్యాన్స్ రిక్వెస్ట్
ఆసియా దేశాలపై టారిఫ్లు ఇలా..
భారత్- 50 శాతం
సిరియా-41 శాతం
మయన్మార్-40 శాతం
లావోస్- 40 శాతం
ఇరాక్ -35 శాతం
చైనా -30 శాతం
కజికిస్థాన్-25 శాతం
వియత్నాం- 20 శాతం
శ్రీలంక-20 శాతం
పాకిస్థాన్-19 శాతం టారిఫ్ విధించారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!