CPI Ramakrishna: ఈసీ, బీజేపీపై రామకృష్ణ ఫైర్.. మోడీ, అమిత్ షా మొత్తం దొంగ ఓట్లు వేయిస్తున్నారు..!
- ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్పై సీపీఐ రామకృష్ణ ఫైర్..
- ప్రధాని మోడీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారు..
- బెంగళూరు బీజేపీ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna: ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్పై మరోసారి ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, బెంగళూరులోని బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు.. బీజేపీ, ఎన్నికల కమిషన్ పై రామకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు.. దేశంలో దొంగల పాలన సాగుతోంది.. నరేంద్ర మోడీ, అమిత్ షా మొత్తం దొంగ ఓట్లు వేసుకున్నారు.. రేపు బీహార్ లో జరిగే ఎన్నికల కోసం 60 లక్షల ఓట్లు తీసేశారు.. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారు. మొత్తం దొంగల రాజ్యం నడుస్తుంది.. ఎన్నికల సంఘానికి సిగ్గు ఉందా? అంటూ ఫైర్ అయ్యారు..
Read Also: Chiranjeevi: నేను ఫెడరేషన్కి చెందిన ఎవరినీ కలవలేదు.. పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్నే అగ్ర సంస్థ!
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ఇక, పూర్తి సమాచారంతో రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే మాకు సమాచారం ఇవ్వాలని అడుగుతారా…? అంటూ ఈసీ మండిపడ్డారు రామకృష్ణ.. ఎన్నికల కమిషన్ బీజేపీకి అమ్ముడుపోయి లాలూచీ పడింది అని ఆరోపించారు.. ఈ సమస్య కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఒక్కరిదీ కాదు.. మోడీ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.. అంబేద్కర్ రాజ్యాంగం వల్ల అందరూ కలిసి ఉన్నాము. కానీ, బీజేపీ కొత్త రాజ్యాంగం రాసుకుంటాం అని అంటున్నారు… రైతుల బాధలు, కష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా…? మీరు దేశంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి..? అని నిలదీశారు.. తప్పుడు కేసులు పెట్టీ అందరిని జైళ్లకు పంపించారు.. బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నారు… దేశంలోనే సీనియర్ నేత అని చెప్పుకునే చంద్రబాబు దొంగ ఓట్ల పై ఎందుకు మాట్లాడడం లేదు.. ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన నాయకుడు ఏం మాట్లాడడం లేదు… అధికారంలో మీరే ఉన్నారు కదా తిరుపతి లడ్డు కల్తీ పై ఎం చర్యలు తీసుకున్నారో చెప్పండి..? అని ప్రశ్నించారు. ఇక, మోడీని చూసి రాష్ట్రంలోని మూడు పార్టీలు భయపడుతున్నాయి… డబుల్ ఇంజన్ సర్కార్ ప్రతి మంగళవారం నాలుగు నుంచి ఐదు వేల కోట్ల అప్పు చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
తాజావార్తలు
-
Shah Rukh Khan: “నా భర్త కంటే మీరే ఇష్టం”.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!