CPI Ramakrishna: ఈసీ, బీజేపీపై రామకృష్ణ ఫైర్.. మోడీ, అమిత్ షా మొత్తం దొంగ ఓట్లు వేయిస్తున్నారు..!
- ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్పై సీపీఐ రామకృష్ణ ఫైర్..
- ప్రధాని మోడీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారు..
- బెంగళూరు బీజేపీ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna: ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్పై మరోసారి ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, బెంగళూరులోని బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు.. బీజేపీ, ఎన్నికల కమిషన్ పై రామకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు.. దేశంలో దొంగల పాలన సాగుతోంది.. నరేంద్ర మోడీ, అమిత్ షా మొత్తం దొంగ ఓట్లు వేసుకున్నారు.. రేపు బీహార్ లో జరిగే ఎన్నికల కోసం 60 లక్షల ఓట్లు తీసేశారు.. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారు. మొత్తం దొంగల రాజ్యం నడుస్తుంది.. ఎన్నికల సంఘానికి సిగ్గు ఉందా? అంటూ ఫైర్ అయ్యారు..
Read Also: Chiranjeevi: నేను ఫెడరేషన్కి చెందిన ఎవరినీ కలవలేదు.. పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్నే అగ్ర సంస్థ!
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఇక, పూర్తి సమాచారంతో రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే మాకు సమాచారం ఇవ్వాలని అడుగుతారా…? అంటూ ఈసీ మండిపడ్డారు రామకృష్ణ.. ఎన్నికల కమిషన్ బీజేపీకి అమ్ముడుపోయి లాలూచీ పడింది అని ఆరోపించారు.. ఈ సమస్య కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఒక్కరిదీ కాదు.. మోడీ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.. అంబేద్కర్ రాజ్యాంగం వల్ల అందరూ కలిసి ఉన్నాము. కానీ, బీజేపీ కొత్త రాజ్యాంగం రాసుకుంటాం అని అంటున్నారు… రైతుల బాధలు, కష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా…? మీరు దేశంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి..? అని నిలదీశారు.. తప్పుడు కేసులు పెట్టీ అందరిని జైళ్లకు పంపించారు.. బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నారు… దేశంలోనే సీనియర్ నేత అని చెప్పుకునే చంద్రబాబు దొంగ ఓట్ల పై ఎందుకు మాట్లాడడం లేదు.. ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన నాయకుడు ఏం మాట్లాడడం లేదు… అధికారంలో మీరే ఉన్నారు కదా తిరుపతి లడ్డు కల్తీ పై ఎం చర్యలు తీసుకున్నారో చెప్పండి..? అని ప్రశ్నించారు. ఇక, మోడీని చూసి రాష్ట్రంలోని మూడు పార్టీలు భయపడుతున్నాయి… డబుల్ ఇంజన్ సర్కార్ ప్రతి మంగళవారం నాలుగు నుంచి ఐదు వేల కోట్ల అప్పు చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?