పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహార్లో జల్పేష్కు వెళుతున్న పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురై 10 మంది మరణించినట్లు ఆదివారం అర్థరాత్రి పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. వ్యాన్లో ఉన్న 27 మందిలో 16 మంది వ్యక్తులకు స్వల్ప గాయాలైనందున చికిత్స కోసం జల్పైగురి ఆసుపత్రికి తరలించారు.