పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసి అగ్రెసివ్ గా క్యాంపైన్స్ చేస్తున్నాడు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. పొలిటికల్ ప్లాన్స్ వేస్తూనే సినిమా పనులు కూడా చేస్తున్న పవన్ కళ్యాణ్… ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్ కి మళ్లీ డేట్స్ కేటాయించడానికి సమాచారం. గబ్బర్…
Harish Shankar: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను అందించి.. స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒకడిగా చేరిపోయాడు. గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.
Chiranjeevi Emotional Tweet on ANR: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుభూతిని, అనుభవాలను పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇక తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆయనతో తమకు ఉన్న మెమోరీస్ షేర్ చేసుకున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాననీ అన్నారు. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ…
నారా బ్రాహ్మణి పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్ చేశారు. తన తాతను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని తెలియదా అని అన్నారు. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలే అంగీకరించటం లేదని విమర్శించారు. చంద్రబాబు కాళ్ళు పిసకమంటే జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా లేరని తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్ఠానిదేనని ఆమె మీడియాతో అన్నారు.
ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా పార్లమెంట్లో మా విధానం ఉంటుందని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ లోక్సభా పక్ష నేత మిథున్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల పూర్తి అజెండాపై ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు.
2024 ఎన్నికల్లో జనసేన బలమైన స్థానాలకో ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడుతోందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవర్ షేరింగు తీసుకునే జనసేన వెళ్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
జనసేన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రత్యేక పరిస్థితుల్లో విస్తృత స్థాయీ సమావేశం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దుర్మార్గపు పాలనను కొత్తగా వచ్చిన పదేళ్ల పార్టీ ఎలా ఎదుర్కొబోతోందో తరచి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.