MP Danish Ali: వివాదాస్పద ఎంపీ డానిష్ అలీని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి..
MP Danish Ali: వివాదాస్పద ఎంపీ డానిష్ అలీని పార్టీ నుంచి బహిష్కరిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్లో డానిష్ అలీ, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనపై రమేష్ బిధూరి మతపరమైన వివక్ష, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ డానిష్ అలీ ఆరోపించారు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.
అయితే తమ డానిష్ అలీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే బహిష్కరణకు కారణమని పార్టీ పేర్కొంది. ‘‘పార్టీ విధానాలు, సిద్ధాంతాలు మరియు క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రకటనలు లేదా చర్యలకు వ్యతిరేకంగా మీరు చాలాసార్లు హెచ్చరించబడ్డారు. అయితే, మీరు నిరంతరం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు’’అని బీఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Also Read
- NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
డానిష్ అలీ, రమేష్ బిధూరి వివాదం నేపథ్యంలో డానిష్ అలీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు మద్దతు పలికారు. తాజాగా క్యాష్ ఫర్ క్వేరీ కేసులో పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురైన మహువా మోయిత్రాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమెకు మద్దతుగా నిన్న పార్లమెంట్ వెలుపల నిరసన తెలియజేశారు.
తనపై చేసిన వ్యాఖ్యలకు రమేష్ బిధూరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వాళ్లు మహువా మోయిత్రాపై చర్యలు తీసుకున్నారని, ఈ రోజు మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఏడుస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో చంద్రయాన్-3 మిషన్పై చర్చ సందర్భంగా బిధురి చేసిన వ్యాఖ్యలపై భారీ రాజకీయ దుమారం చెలరేగింది. దక్షిణ ఢిల్లీ ఎంపీని రెచ్చగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచే పదాలను ఉపయోగించారని పలువురు బీజేపీ నేతలు, డానిష్ అలీపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి, డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై ఇప్పటికే స్పీకర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే రమేష్ బిధూరి తన వ్యాఖ్యలపై గురువారం జరిగిన లోక్ సభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశంలో విచారం వ్యక్తం చేశారు.
జేడీయూలో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన డానిష్ అలీ 2019లో బీఎస్పీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమ్రోహా నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి దాదాపుగా 63,000 ఓట్ల తేడాతో బీజేపీ నేత కన్వర్ సింగ్ తన్వర్పై విజయం సాధించారు.
తాజావార్తలు
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!