Pakistan and West Indies have won T20 World Cup most times: అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఆకర్షణీయ టోర్నీ టీ20 ప్రపంచకప్ 2024 నేడు ఆరంభమైంది. వెస్టిండీస్తో కలిసి అగ్రరాజ్యం అమెరికా టీ20 ప్రపంచకప్కు తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. 8 అగ్రశ్రేణి జట్లకు తోడు మరో 12 టీమ్లు విశ్వ వేదికపై తమదైన ముద్ర చూపాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో టి20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగనుంది. అమెరికా, కెనడా మధ్య మ్యాచ్…
టీ20 వరల్డ్ కప్ 2024కి జట్టును ప్రకటించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. మెగా టోర్నీకి సమయం తక్కువగా ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టును ఇంకా ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మంగళవారం బంగ్లాదేశ్ కూడా తన జట్టును ప్రకటించిందని తెలిపారు. కాగా.. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్లో పర్యటిస్తుంది.
టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. 3 టీ20ల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ వెళ్లిన పాకిస్థాన్ శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయింది. డబ్లిన్లో జరిగిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పాక్ నిర్దేశించిన 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 19.5…
టీ20 వరల్డ్కప్-2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టు న్యూ జెర్సీని రివీల్ చేసింది. మ్యాట్రిక్స్ జెర్సీ' 24 పేరుతో పీసీబీ బోర్డ్ తమ కొత్త జెర్సీని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే1ని ఐసీసీ డెడ్లైన్గా విధించింది. గడువు లోగా న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ లాంటి జట్లు తమ ప్రపంచకప్ టీంలను వెల్లడించాయి. అయితే గడువు ముగిసినా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తమ జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాల కారణంగానే పాకిస్థాన్ జట్టును ఇంకా జట్టును ప్రకటించలేదట. తమ…
ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మొదటి రెండు మ్యాచ్లు గెలిచిన తర్వాత మళ్లీ గెలుపొందలేదు. మొత్తం 6 మ్యాచ్ ల్లో రెండు గెలిచి, నాలుగు ఓడిపోయారు. ఇంకా పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్కు చేరుకోవాలన్న కల దాదాపుగా చెదిరిపోయినట్లే..
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఒకప్పుడు బలమైన జట్టుగా ఉండేదని.. నిప్పులు చెరిగే పేస్ బౌలర్లు, బంతిని గింగిరాలు తిప్పే స్పిన్నర్లు ఉండేవాళ్లని, అంతేకాకుండా బ్యాట్స్ మెన్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవారని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
టీమిండియాపై పాకిస్థాన్ ఓటమి తర్వాత బాబర్ అజామ్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని సొంత దేశానికి చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు వైఖరి, బాబర్ అజామ్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. మొన్న ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిని ఇంకా దిగమింగుకోక ముందే.. ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. పాకిస్తాన్ జట్టులో కొందరు ఆటగాళ్లు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి ప్లేయర్లు ఉన్నారు.
అహ్మదాబాద్లోని ప్రధాని మోడీ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు భారత్తో మ్యాచ్ ఆడటం కోసం ఇక్కడకు చేరుకున్నారు. పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు అమ్మాయిలు నృత్యం చేశారు. గుజరాతీ దుస్తులు ధరించిన అమ్మాయిలు పాకిస్థాన్ ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ కనిపించారు. అంతేకాకుండా వారిపై పూలవర్షం కురిపించారు. పాక్ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడం టీమిండియా అభిమానులకు నచ్చలేదు.