Pakistan: పాక్ ఆటగాళ్లకు ఘనస్వాగతం పలకడంపై మండిపడుతున్న టీమిండియా అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం అహ్మదాబాద్లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది. వారికి స్వాగతం పలికేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో టీమిండియా అభిమానులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు. అందుకు సంబంధించి అభిమానులతో పాటు పలువురు నేతలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు.
Read Also: World Cup: 2003-2019 వరల్డ్ కప్.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ వివరాలు ఇవే..!
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
అహ్మదాబాద్లోని ప్రధాని మోడీ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు భారత్తో మ్యాచ్ ఆడటం కోసం ఇక్కడకు చేరుకున్నారు. పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు అమ్మాయిలు నృత్యం చేశారు. గుజరాతీ దుస్తులు ధరించిన అమ్మాయిలు పాకిస్థాన్ ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ కనిపించారు. అంతేకాకుండా వారిపై పూలవర్షం కురిపించారు. పాక్ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడం టీమిండియా అభిమానులకు నచ్చలేదు. దీంతో ఒక నెటిజన్ బీసీసీఐని ట్రోల్ చేశాడు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఇండియన్ ఆర్మీ ఫోటోను షేర్ చేస్తూ, సైనికుల బలిదానాన్ని బీసీసీఐ మరిచిపోయిందని రాశారు.
Read Also: B.Tech Student Suicide: ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని సూసైడ్.. కారణమదేనా?
ఇదిలా ఉంటే.. 2023 ప్రపంచకప్లో పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. తన తొలి మ్యాచ్ను నెదర్లాండ్స్తో ఆడగా.. రెండో మ్యాచ్ శ్రీలంకతో ఆడింది. ఇక టీమిండియా కూడా ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడి 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్తో తలపడి 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
I always Hate BCCI from Beginning for not taking our Sanju Samson in squads.. but from now everyone will hate shame on BCCI For us we need only our soilders ❤️🇮🇳 #IndianArmy #IndianRailways #TrainAccident #Kohli #JayShah #INDvsAFG #INDvsPAK #Ahmedabad #EmergencyAlert 🇮🇳 Jawans🙏 pic.twitter.com/F5di5e0rst
— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) October 12, 2023
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!