ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మొదటి రెండు మ్యాచ్లు గెలిచిన తర్వాత మళ్లీ గెలుపొందలేదు. మొత్తం 6 మ్యాచ్ ల్లో రెండు గెలిచి, నాలుగు ఓడిపోయారు. ఇంకా పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్కు చేరుకోవాలన్న కల దాదాపుగా చెదిరిపోయినట్లే.. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఇప్పటికీ ఈ ప్రపంచ కప్లో సెమీ-ఫైనల్కు చేరుకోగలదు. అందుకోసం జట్టు అద్భుతమైన ప్రదర్శనతో పాటు మిగిలిన 9 జట్ల గెలుపు ఓటమిలపై ఆధారపడి ఉంటుంది.
Read Also: Police Case: ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి.. కత్తితో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు
పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ ఎలా చేరుతుంది?
పాకిస్థాన్ తన మిగిలిన మూడు మ్యాచ్లను భారీ తేడాతో గెలవాలి. పాకిస్థాన్ వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్లు తమ తమ మ్యాచ్లను ఆస్ట్రేలియాతో గెలవాలి.
శ్రీలంకపై న్యూజిలాండ్ తప్పనిసరిగా గెలవాలి.
నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్లో భారత్ తప్పక గెలవాలి.
అఫ్గానిస్థాన్తో జరిగే మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంక గెలవాల్సి ఉంది.
శ్రీలంకతో జరిగే మ్యాచ్లో భారత్ లేదా బంగ్లాదేశ్ గెలవాల్సి ఉంటుంది.
Read Also: Mansukh Mandaviya: కరోనా బాధితులకు బిగ్ అలర్ట్.. గుండెపోటు కేసులపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఈ 6 సమీకరణాలు వర్క్ ఔట్ అయితే.. ఈ ప్రపంచకప్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్కు చేరుకోగలదు. మీరు ఈ సమీకరణాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ టోర్నమెంట్లోని మిగతా 9 జట్ల గెలుపు లేదా ఓటమిపై పాకిస్తాన్ సెమీ-ఫైనల్కు చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ ఇంకా సెమీఫైనల్కు చేరితే అది నిజంగా అద్భుతమే.