ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల అమ్మకాలు ప్రభుత్వ నేతృత్వంలోనే జరగాలనే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టమైన వైఖరిని అవలంబించబోతున్నారు. దానికి ఉదాహరణంగా నిన్న రాష్ట్ర సమాచార, రోడ్డు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని నిర్వహించిన మీడియా సమావేశాన్ని పేర్కొవచ్చు. ఐ అండ్ పీఆర్ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డితో కలిసి పేర్ని నాని మీడియాతో మాట్లాడిన విషయాలను కూలంకషంగా పరిశీలిస్తే, సినిమా పరిశ్రమ కోరుకున్నదే జగన్ చేయబోతున్నారన్న భావన ఎవరికైనా కలుగుతుంది.…
ఏపీ ప్రభుత్వం మల్టీప్లెక్స్ లతో సహా సినిమా థియేటర్స్ కోసం ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలను ప్రవేశపెట్టనున్నారనే వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే ఈ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని, పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి, ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి…