ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వేరియంట్ ఓమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ను భారతదేశంలో కనుగొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ బుధవారం వెల్లడించారు. బీఏ.2.75గా పిలిచే ఈ వేరియంట్ భారత్ తో పాటు 10 దేశాల్లో కూడా గుర్తించారు. ఈ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే కొత్తగా…
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన మూడు వారాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా ఏడు రెట్లు పెరిగాయి. కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గక పోవడంతో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రోజున 493 మందికి పాజిటివ్గా తేలింది. గురువారంతో పోల్చుకుంటే హైదరాబాద్ జిల్లాలో సుమారు 50 కేసులు అధికమయ్యాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కోలుకున్న వారి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్నటి రోజైన శుక్రవారం…
కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని భయాందోళనుకు గురి చేసిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మరో సారి కోరలు చాస్తోంది. రోజురోజుకు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య నిన్న 25 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ రోజువారీ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ 200కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు మాస్కులు…
ప్రపంచ దేశాలపై కరోనా ప్రభావం అంతా ఇంత కాదు.. వైరస్ సృష్టించిన విలయానికి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం. అయితే ప్రస్తుతం చోటుచేసుకుంటోన్న వాతావరణ మార్పులు తదుపరి వైరస్కి కారణమవుతన్నాయని తాజా అధ్యయనం అంచనా వేసింది. విపరీతంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి తరలి రావడం, దాంతో వైరస్లు జంతువుల నుంచి మానవులకు సోకడంతో మరో మహమ్మారి ముప్పును పెంచుతున్నట్లు నివేదికలో వెల్లడైంది. Read Also: Honour Killing: పరువు హత్యపై ఒవైసీ రియాక్షన్ జంతువులను ఒకేచోట…
ప్రపంచ దేశాలను, ఆర్థిక వ్యవస్థను, అన్ని రంగాలను ఓ కుదుపుకుదిపిన కరోనా మహమ్మారి భయం ఇంకా వెంటాడుతూనే ఉంది.. ఒమిక్రాన్ రూపంలో థర్డ్వేగా భారత్లో విజృంభించిన కోవిడ్ కేసులు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి.. కానీ, కరోనా కరోనా కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి.. ఇక, ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్లో రెండు సబ్ వేరియంట్లు.. బీఏ 4, బీఏ5 ఆందోళన కలిగిస్తున్నాయి.. కొత్త వేరియంట్ల వ్యాప్తి, ప్రభావంపై దృష్టి సారించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో). కొత్త…
కరోనా కల్లోలం నుంచి బయటపడి.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ ఎటాక్ చేసినా.. మళ్లీ కేసులు తగ్గిపోయాయి.. ఈ మధ్య కేసులు పెరుగుతోన్న ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం.. వారం రోజుల వ్యవధిలో నమోదైన కేసులను ప్రస్తావిస్తూ.. అలెర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.. హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని తెలిపిన కేంద్రం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని పేర్కొంటూ కేంద్ర…
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టెన్షన్ కాస్త తగ్గిపోయింది… భారత్లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్లో కొత్తగా వెలుగు చూసిన కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్ రూపంలో భారత్లో థర్డ్ వేవ్ ప్రారంభమై మరోసారి కలవరపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది. దీంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ…