భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హైదరాబాద్కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొహియుద్దీన్ అరెస్టుపై కుటుంబ సభ్యులు స్పందించారు. మొహియుద్దీన్ సోదరుడు ఒమర్ ఫారూఖీ ఎన్టీవీతో ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడాడు. తన సోదరుడు మంచోడని, ఎవరో కావాలనే కుట్రలో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన బ్రదర్ ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్…