పాక్తో యుద్ధం తర్వాత జరిగిన చర్చల్లో మనం ఒక షరతు పెట్టి ఉండాల్సిందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ సాహిబ్.. మనకు దక్కాలని గట్టిగా అడిగి ఉండాల్సిందన్నారు.
భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగాక 93 వేల మంది సైనికులు.. భారత సైన్యానికి సరెండర్ అయ్యారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడారు.
PM Modi: ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తెలంగాణలో బీజేపీ అన్ని పార్లమెంట్ స్థానాలను క్లీన్స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 80-90లో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో అదే విధంగా తెలంగాణలో కూడా జరుగుతోందని ప్రధాని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అన్నారు. ఇక్కడ ప్రజలు తక్కువ సయమంలోనే ప్రజలు నిరాశలో పడిపోయారని అన్నారు.…
PM Modi: తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, రాజ్యాంగం రద్దు చేస్తున్నారని.. అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచేందుకు ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.…
వెలమల కోటలో బీసీ రెండోసారి పాగా వేయగలుగుతారా? ఒకసారి గెలిచిన బీసీ ఎంపీ రెండోసారి గెలవబోరన్న సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా? లేక బలపడుతుందా? అగ్రవర్ణ నేతలతో ఢీ అంటే ఢీ అంటున్న ఆ సిట్టింగ్ ఎంపీ రెండోసారి లోక్సభ మెట్లు ఎక్కగలుగుతారా? ఏదా నియోజకవర్గం? ఏంటా సెంటిమెంట్ స్టోరీ? కరీంనగర్ లోక్సభ సీట్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఈ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో కలిపి 17 లక్షల 96 వేల దాకా ఓట్లు ఉన్నాయి. 17…
ఏదైతే ఏముంది… కప్పేసుకోండి కండువాలు. అన్నీ మనవే, అంతా మనోళ్లే అంటున్నారు అక్కడ కూటమి లీడర్స్. ఆ నియోజకవర్గంలో కేడర్లేని బీజేపీకి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంతో మంత్రసానితనం ఒప్పుకున్నాక తప్పుతుందా…అనుకుంటూ టీడీపీ కార్యకర్తలకే బీజేపీ కండువాలు వేసేస్తున్నారు. ఏదో ఒకటి కానిచ్చేయండని పై స్థాయిలో అంటున్నా… ఠాఠ్… ఆ కండువా మాకెందుని అంటోందట కేడర్. ఎక్కడుందా విచిత్రమైన పరిస్థితి? ఏంటా గోల? ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి…
ఆ నియోజకవర్గానికి ఎవరైనా ఒక్కసారే ఎమ్మెల్యే. రెండోసారి మాత్రం వాళ్ళే దండం పెట్టేసి మరీ వెళ్ళిపోతున్నారట. రెండు ప్రధాన పార్టీలను ఒకే సామాజికవర్గం శాసిస్తోందని, ఎమ్మెల్యేని వాళ్ళే ఫిక్స్ చేస్తారన్నది ఇంటర్నల్ టాక్. వాళ్ళకి చెక్ పెట్టడానికి ఈసారి మరో సామాజికవర్గం పావులు కదుపుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా కులాల కురుక్షేత్రం? తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలప్పుడు అన్ని పార్టీల నుంచి కొత్త ముఖాలే కనిపిస్తుంటాయి. అది ఇది అని…
కూటమిగా ప్రజల్లోకి వెళ్లాల్సిన పార్టీల మధ్య కుంపట్ల రాజుకుంటున్నాయా..? పైకి కన్పించని అగాధమేదో లోలోపల పెరిగిపోతోందా? మోడీ పేరును వాడుకోవడం లేదని బీజేపీ ఫీలవుతుంటే…. ఆ వివాదాలు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయోనని టీడీపీ, జనసేన భయపడుతున్నాయా? ముస్లిం రిజర్వేషన్స్ తుట్టెను కదిపితే… మొదటికే మోసం వస్తుందని గ్లాస్, సైకిల్ భయపడుతున్నాయా? పోలింగ్ ముంగిట్లో జరగబోతున్న పరిణామాలేంటి? లెట్స్ వాచ్. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య పైకి కనిపించనిది ఏదో జరుగుతోందా? అంటే అవును నిజమే కావచ్చన్నది…