ఎన్నికల ప్రచారంలో ఇచ్చినట్లే…ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాలు సకాలంలో పూర్తవుతాయా ? రైతులకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబునాయుడు నిలబెట్టుకుంటారా ? రాజధాని అజెండాతో మూడు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు…అమరావతి విషయంలో సాధించిందేంటి ? రాజధాని నిర్మాణాలు నత్తనడకన సాగితే…వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవా ? సీఆర్డీఏ అధికారుల విషయంలో రైతుల వాదనేంటి ? ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి ? తెలుగుదేశం పార్టీ ప్రధాన ఏజెండా…రాజధాని అమరావతి. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ…
ఆ మంత్రి మెరుపు తీగలా మాయమవుతాడు. పాదరసంలా జారుకుంటాడు. అవసరం వుంటేనే జిల్లాలో వాలిపోతాడు. ఇప్పుడా అవసరం ఏంటనే చర్చ…అనవసర రాద్దాంతం అవుతోంది. చివరికి మినిస్టర్కే తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎంతకీ ఎవరా అమాత్యుడు? మంత్రి అనగాని సత్యప్రసాద్ చిక్కడు..దొరకడు అన్నట్టుగా తెగ ఫీలవుతున్నారు తిరుపతి జిల్లా తెలుగు తమ్ముళ్లు. ఉమ్మడి జిల్లానైనా, లేదంటే విడిగా తిరుపతి జిల్లా చూసుకున్నా మంత్రి పదవి మాత్రం స్థానిక నేతలకు దక్కలేదు. ఆ తర్వాత జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ప్రస్తుత రెవెన్యూ…
Story Board: మావోయిస్టులకు కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజల కోసం మొదలైన ఉద్యమం.. చివరకు మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా మారింది. ఈ పోరు ఐదు దశాబ్దాల పాటు రాజీలేని విధంగా సాగింది. గతంలో ఓసారి పోలీసులది పైచేయి అయితే.. మరోసారి మావోయిస్టులది పైచేయి ఉండేది. ప్రతీకార దాడులు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోరాటం ఏకపక్షమైపోయింది. ఎక్కడ చూసినా మావోయిస్టుల ఎన్కౌంటర్లే తప్ప.. పోలీసుల మరణాలు కనిపించడం లేదు. ఇంతింతై వటుడింతై…
ibomma: దమ్ముంటే పట్టుకోండని సవాల్ విసిరితే… చూస్తూ ఊరుకుంటారు.. తాట తీశారు సీపీ సజ్జనార్. సినామా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిపెడుతూ… జనాల పర్సనల్ డేటా చోరీ చేస్తూ.. దేశ భద్రతకే ముప్పుగా మారిన ఇమంది రవి ఆటకట్టించారు. ఇమంది రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏళ్ల తరబడి రవి సృష్టించుకున్న పైరసీ రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించారు. ఇప్పటికే ఐ బొమ్మ. బప్పం టీవీ, ఇరాదా వంటి సైట్లను క్లోజ్ చేసిన పోలీసులు… పైరసీ కంటెంట్…
ఎక్కడ…? ఎమ్మెల్సీ ఎక్కడ…? పోస్ట్ వచ్చిన కొత్తల్లో పెద్ద పెద్ద టూర్ ప్లాన్స్ వేసి కొన్నాళ్ళు ఓ రేంజ్లో హడావిడి చేసిన నాయకుడు ఇప్పుడెందుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు? అసలు ఏపీకే ఆయన చుట్టమైపోయారా? ప్రస్తుతం జనసేన వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఏ ఎమ్మెల్సీ కోసం పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి? ఎందుకలా..? నాగబాబు…. జనసేన కీలక నేత. పార్టీలో పవన్ తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యం ఇస్తుంది కేడర్. ఇక ఎమ్మెల్సీ పదవివచ్చిన…
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇక పోలీస్ రాడార్ పరిధిలోకి వచ్చేశారా? ఆయన విషయంలో ఇన్నాళ్లు ఒక ఎత్తు… ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఉండబోతోందా? అంబటికి కూడా అదే ఫీలింగ్ వచ్చేసిందా? ఎక్స్ మినిస్టర్ విషయంలో సడన్గా జరిగిన మార్పు ఏంటి? ఇన్నాళ్ళుగా లేనిది… ఇప్పుడెందుకు అరెస్ట్ భయాలు మొదలయ్యాయి? వైసీపీ ఫైర్బ్రాండ్ లీడర్ అంబటి రాంబాబు. పార్టీ అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా… ఎప్పుడూ ఏదో ఒక ఎపిసోడ్తో వార్తల్లో నలుగుతుంటారాయన. ఈ…
జూబ్లీహిల్స్లో కమలం ఎందుకు వాడిపోయింది? కనీసం డిపాజిట్ కూడా దక్కక పోవడానికి కారణాలేంటి? లోపం ఎక్కడ జరిగింది? కార్యకర్తల కష్టానికి కనీస విలువ కూడా లేకుండా చేసింది ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలుగంటున్న పార్టీ ఈ ఫలితాన్ని ఎలా చూస్తోంది? జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీకి భారీ ఝలక్ తగిలింది. కనీసం డిపాజిట్ దక్కకుండా పోయింది. అంతెందుకు… 2023లో వచ్చిన ఓటు శాతాన్ని కూడా తిరిగి సాధించుకోలేకపోయింది కాషాయ దళం. దీంతో… అసలు మనం ఎక్కడున్నాం….…
ఆ నియోజకవర్గంలో…కూటమి, వైసీపీ నేతలు కలగలిసి యుగళ గీతం పాడుతున్నారా? ప్రజలంతా ఒకవైపు, అన్ని పార్టీల నాయకులు మాత్రం మరో వైపు అన్నట్టుగా ఉందా? ఏ విషయంలో జనాన్ని కాదని పార్టీలకు అతీతంగా నాయకులు పిల్లి మొగ్గలేస్తున్నారు? ఎక్కడ ఉందా పరిస్థితి? కర్రుగాల్చి వాత పెట్టడానికి అక్కడి జనం కూడా ఎదురు చూస్తున్నారన్నది నిజమేనా? జిల్లాల పునర్విభజనలో భాగంగా… ఉమ్మడి తూర్పు గోదావరిని మూడుగా విభజించింది గత వైసీపీ ప్రభుత్వం. లోక్సభ నియోజకవర్గాల వారీగా జరిగిన ఆ…
ఒక్క ఫలితం… వంద సంకేతాలు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ విషయంలో జరుగుతున్న చర్చ ఇది. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు వ్యక్తిగతంగా సీఎం రేవంత్రెడ్డికి ఇది నిజంగా బూస్ట్ అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏయే కోణాల్లో ఈ ఫలితం ప్లస్ అవుతోంది? పార్టీ మీద, ప్రభుత్వంలో పట్టు బిగించేందుకు సీఎం చేతిలో ఎలాంటి అస్త్రం అవబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీ పరపతికి, ప్రత్యేకించి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వ పటిమకు నిదర్శనమన్న అభిప్రాయం బలంగా ఉంది.…
AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. 65కి పైగా ఎజెండా అంశాల అజెండాతో సాగిన ఈ సమావేశంలో 65కి పైగా అంశాలను ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.. వైజాగ్ లో ఈ నెలలో జరగబోయే సీఐఐ సమ్మిట్కు సంబంధించి చర్చ సాగింది.. క్వాoటం పాలసీకి ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. ఇక, మొంథా తుఫాన్ సందర్భంగా చేపట్టిన చర్యలపై మంత్రులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి…