శబరిమలలోని అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని తెరిచారు పూజారులు.. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఈ ప్రత్యేక పూజలకు భక్తులకు అనుమతి ఇచ్చినా.. కొన్ని షరతులు విధించారు.. నిన్న సాయంత్రం ఆలయాన్ని తెరిచిన పూజారులు.. ఇవాళ ఉదయం నుంచి భక్తులను అనుమతి ఇస్తున్నారు.. కరోనా భయాలు వెంటాడుతుండడంతో.. ముందుగానే బుక్ చేసుకున్న 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. కరోనా సెకండ్ వేవ్…