విక్టరీ వెంకటేశ్ లేటెస్ట్ మూవీ ‘నారప్ప’కు అన్ని వర్గాల నుండి చక్కని ప్రశంసలు దక్కుతున్నాయి. తమిళ ‘అసురన్’తో పోల్చకుండా చూస్తే… నిజంగానే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప అనుభూతిని కలిగించిందని అందరూ అంటున్నారు. మరీ ముఖ్యంగా వెంకటేశ్ నట జీవితంలో ఇదే ప్రత్యేక చిత్రమని అభినందిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను సినీ ప్రముఖులు సైతం సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. వీరిందరి అభినందనలూ ఒక ఎత్తు అయితే… వెంకటేశ్ మేనల్లుడు నాగచైతన్య భార్య సమంత…
37 సంవత్సరాల రానా దగ్గుబాటి గత యేడాది ఆగస్ట్ 8న తన గర్ల్ ఫ్రెండ్ మిహికా బజాజ్ తో కలిసి ఏడు అడుగులు నడిచాడు. దాదాపు 11 నెలల వైవాహిక జీవితం తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని రానా చెబుతున్నాడు. అంతే కాదు… పెళ్ళి తర్వాత ఇలాంటి మార్పు అందరు మనుషుల్లోనూ వస్తుందని రానా అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా తాను ఉంటున్నానని అన్నాడు. రానా చెబుతున్న దాని బట్టి ఆయన భార్య మిహికా… భర్తకు ఎంతో…
తమిళ ‘అసురన్’కు తెలుగు రీమేక్ ‘నారప్ప’. అక్కడ ధనుష్ కథానాయకుడు కాగా, ఇక్కడ వెంకటేశ్ హీరోగా నటించారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి ఎస్ థాను దీన్ని నిర్మించారు. మే 14న థియేటర్లలో రిలీజ్ చేయాలని మొదట భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో తప్పని స్థితిలో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ‘వి’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలు కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఓటీటీలో…
విక్టరీ వెంకటేశ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ‘నారప్ప’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను మే 14న థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నామని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నామ’ని ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కలైపులి ఎస్. థాను చెప్పారు. 17 సంవత్సరాల క్రితం 2004లో వెంకటేశ్ తో ‘ఘర్షణ’ చిత్రం తెలుగులో తీసిన ఆయన మళ్లీ ఇంతకాలానికి ‘నారప్ప’ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘సురేశ్…
విక్టరీ వెంకటేష్ నటించిన ఆసక్తికర భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. కొన్ని గంటల్లో డిజిటల్ స్క్రీన్లలోకి రానుంది. ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుందని మేకర్స్ ప్రకటించారు. తాజా నివేదికల ప్రకారం జూలై 19నే భారతీయ ప్రేక్షకుల కోసం “నారప్ప” అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాత్రి 10 గంటల నుండి ప్రసారం చేయనున్నారు. అంటే రిలీజ్ చేస్తామని ప్రకటించిన దానికంటే ముందే అందుబాటులో ఉంటుంది. యుఎస్ఎ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం…
విక్టరీ వెంకటేష్-ప్రియమణి జంటగా నటించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20న ఓటీటీలో విడుదల కాబోతుంది. కాగా, అగ్ర నిర్మాత అయినటు వంటి సురేష్బాబు ఈ సినిమాను ఓటీటీ బాట తీసుకెళ్లడంతో ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది వివాదంగా మారడంతో తాజాగా నిర్మాత సురేష్బాబు స్పందించారు. సినిమా ఓటీటీ అనేది తన ఒక్కడి నిర్ణయం కాదన్నారు. కళైపులి ఎస్ థాను తీసుకున్న నిర్ణయమన్నారు. ఇక దృశ్యం 2, విరాట పర్వం సినిమాలు కూడా…
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’.. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. కాగా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత సురేష్ బాబు నారప్ప విశేషాలు చెప్పుకొచ్చారు. అయితే నారప్ప ఓటీటీ రిలీజ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపైనా ఆయన కాస్త ఎమోషనల్ అవుతూ క్షమాపణలు కోరాడు. సురేశ్ ప్రొడక్షన్స్లో తీసే చిత్రాలు తన…
విక్టరీ వెంకటేశ్ వెండితెరపై వినోదాన్నే కాదు, పగ ప్రతీకారాలనూ అద్భుతంగా ఆవిష్కరించగలడు. దానికి తాజా ఉదాహరణ ‘నారప్ప’. తన కొడుకును హతమార్చిన ఓ వర్గంపై నారప్ప అనే రైతు ఎలా పగ తీర్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథ. అందులో కులం కూడా ఓ ప్రముఖ పాత్ర పోషించింది. వెట్రిమారన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘అసురన్’కు ఇది రీమేక్. యంగ్ హీరో ధనుష్ పోషించిన పాత్రను వెంకటేశ్ రక్తి కట్టించగలడా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేయకపోలేదు. దానికి…
టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘నారప్ప’. ఈ చిత్రంలో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. వెంకటేశ్ సరసన ప్రియమణి నటిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ‘నారప్ప’ చిత్రాన్ని జులై 20న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప..…