కర్నూలు నగరంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నంద్యాల మైనర్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కలిగి ఉన్నాడనే సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మిగనూరు , కడప, నంద్యాలలో ఉంటున్న బంధువుల ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. నంద్యాల మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు జాకబ్ రాజశేఖర్. ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన…
కర్నూలు జూపాడుబంగ్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో వందలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు,విరోచనాలు తీవ్ర అస్వస్థతకు గురైన 20 మందిని నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు పిల్లలు వున్నారు. వీరి పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు చెబుతున్నారు.జూపాడుబంగ్లాలోని నీలిపల్లె పేటకు చెందిన 20 మంది నందికొట్కూరు ఆసుపత్రిలో చేరారు. ఆరుగురు ఆందోళనకరంగా వుండడంతో వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మంచి నీరు కలుషితం కావడం వల్లే అతిసార ప్రబలుతోందని స్థానికులు చెబుతున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రియాంకనగర్లో విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఒకరు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు వారిని వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వైఎస్ఆర్ నగర్కు చెందిన గోవింద్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: ఇలానే కొనసాగితే… వాటికి ముప్పు…