కర్నూలు నగరంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నంద్యాల మైనర్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కలిగి ఉన్నాడనే సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మిగనూరు , కడప, నంద్యాలలో ఉంటున్న బంధువుల ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
నంద్యాల మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు జాకబ్ రాజశేఖర్. ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కర్నూలు ఏసీబీ డిఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఆరోపణతో కర్నూలు, నంద్యాల,ఎమ్మిగనూరు, కడప లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు కొనసాగుతున్నాయని ఇప్పటివరకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని డిఎస్పీ తెలిపారు. రాజశేఖర్ కు రెండు లాకర్లు ఉన్నట్లు గుర్తించామని వాటిని ఓపెన్ చేసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు.