నంద్యాలలో ఇరిగేషన్ ఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు నగరంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నంద్యాల మైనర్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కలిగి ఉన్నాడనే సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మిగనూరు , కడప, నంద్యాలలో ఉంటున్న బంధువుల ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
నంద్యాల మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు జాకబ్ రాజశేఖర్. ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కర్నూలు ఏసీబీ డిఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఆరోపణతో కర్నూలు, నంద్యాల,ఎమ్మిగనూరు, కడప లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు కొనసాగుతున్నాయని ఇప్పటివరకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని డిఎస్పీ తెలిపారు. రాజశేఖర్ కు రెండు లాకర్లు ఉన్నట్లు గుర్తించామని వాటిని ఓపెన్ చేసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు.
తాజావార్తలు
-
Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
-
Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..