తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దెబ్బకు మహిళలు హడలిపోతున్నారు అంటూ ధ్వజమెత్తారు వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల.. అంతేకాదు.. టీడీపీ నేతలు మొత్తం ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటలు ఫాలో అవుతున్నారు అంటూ సెటైర్లు వేశారు..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం ఎంత పెద్ద ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, అప్పట్లోనే సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అన్నట్టుగానే, ప్రస్తుతానికి అఖండ 2 సినిమాకి సంబంధించిన సీక్వెల్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 25వ తేదీన దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని ముందు భావించారు.…
Rakshabandhan: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నందమూరి బాలకృష్ణకు తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టింది. ఆ తర్వాత ఇరువురు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ తన సోదరి పురందేశ్వరి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను దగ్గుబాటి పురందేశ్వరి సోషల్ మీడియా వేడుకగా పంచుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. దగ్గుబాటి పురందేశ్వరి వీడియోని షేర్ చేస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన సందేశాన్ని తెలిపింది.…
టాలీవుడ్లో సినీ కార్మికులు, నిర్మాతల మధ్య మొదలైన వేతన పెంపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, నందమూరి బాలకృష్ణను గిల్డ్ నిర్మాతల బృందం కలిసి విస్తృతంగా చర్చించింది. ఈ సమావేశంలో ఫెడరేషన్తో జరుగుతున్న చర్చలు, కార్మికుల సంక్షేమం గురించి కీలక అంశాలు చర్చించారని సమాచారం. ఈ సమావేశం గురించి నిర్మాత ప్రసన్న కుమార్ కొన్ని ముఖ్యమైన వివరాలను పంచుకున్నారు. ALso Read:Jr NTR vs Hrithik: అసలైన డ్యాన్స్ వార్.. రెడీగా ఉండండ్రా అబ్బాయిలూ! సమావేశంలో…
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
Balakrishna Reacts to Bhagavanth Kesari Winning National Award: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ ఎంపికైంది. భగవంత్ కేసరికి జాతీయ అవార్డు దక్కడంపై ఇప్పటికే చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించగా.. తాజాగా బాలయ్య బాబు స్పందించారు. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్…
Anil Ravipudi React on National Award Win for Bhagavanth Kesariనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంకు జాతీయ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డు 2025లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అనిల్ రావిపూడి (దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని…
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (2023) కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ నిలిచింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. భగవంత్ కేసరి సినిమాకు అవార్డు రావడంతో బాలయ్య బాబు ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘జై బాలయ్య’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. 2023 సంవత్సరానికి జ్యూరీ జాతీయ చలనచిత్ర అవార్డ్స్…
Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ కట్ ఒక్కసారిగా ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సెకండ్ పార్ట్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ పూర్తి కానుంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉన్నారు. కానీ అప్పటికి రిలీజ్ అవుతుందా లేదా అనేది త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త తెర మీదకు వచ్చింది.