బీజేపీ మాజీ నేత, గిరిజన నాయకుడు నంద్ కుమార్ సాయి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో కాంగ్రెస్లో చేరారు. బీజేపీని విడిచిపెట్టడం తనకు కఠినమైన నిర్ణయమని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని భూపేష్ బఘేల్ ప్రభుత్వ పనులు తనకు నచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా పాల్గొని ఆయనకు పార్టీలోకి స్వాగతం పలికారు.