బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి నీరజ్ కుమార్ బబ్లూ శుక్రవారం నాలుగు నవజాత పులి పిల్లలకు పేర్లు పెట్టారు. పులుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆయన నాలుగు పులి పిల్లలకు పేర్లు పెట్టారు. మూడు మగ పిల్లలు, ఒక ఆడ పిల్లకు కుమార్ కేశరి, విక్రమ్, మగద్, రాణి పేర్లను పెట్టినట్లు వెల్లడించారు.