Names to Tiger Cubs: నాలుగు నవజాత పులి పిల్లలకు పేర్లు పెట్టిన బిహార్ సీఎం.. పేర్లేమిటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Names to Tiger Cubs: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి నీరజ్ కుమార్ బబ్లూ శుక్రవారం నాలుగు నవజాత పులి పిల్లలకు పేర్లు పెట్టారు. పులుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆయన నాలుగు పులి పిల్లలకు పేర్లు పెట్టారు. మూడు మగ పిల్లలు, ఒక ఆడ పిల్లకు కుమార్ కేశరి, విక్రమ్, మగద్, రాణి పేర్లను పెట్టినట్లు వెల్లడించారు. “ఈ నాలుగు పిల్లలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు పెట్టారు. కేశరి, విక్రమ్, మగధ, రాణి ఈ నాలుగు పేర్లు పెట్టారు” అని అటవీ, పర్యావరణ మంత్రి నీరజ్ కుమార్ బబ్లూ చెప్పారు. పులుల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని కుమార్ తెలిపారు. “2018 లెక్కల ప్రకారం, పులుల సంఖ్య 31 కాగా.. 2022 నివేదిక ఇంకా రావాల్సి ఉంది. పులుల సంఖ్య ప్రస్తుతం 45 అని తాను భావిస్తున్నా. ఒక పులి నాలుగు పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. పుట్టిన నాలుగు పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. చాలా సందర్భాలలో నాలుగు నవజాత పిల్లలలో రెండు చనిపోయాయి. ఈ సారి నాలుగు ప్రాణాలతో బయటపడ్డాయి. ఆ కోణంల చాలా అదృష్టవంతులం” అని అన్నారాయన.
ప్రత్యేక వైద్యుల బృందం వన్యప్రాణులను నిరంతరం పర్యవేక్షిస్తూ, జూ అధికారులు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భారతదేశంలో ప్రస్తుతం 52 టైగర్ రిజర్వ్లు ఉన్నాయని, పులుల సంరక్షణలో స్థానిక సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు వినూత్న చర్యలు చేపడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు శుక్రవారం తెలియజేశారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా, పులిని రక్షించడానికి చురుకుగా పనిచేస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. భారతదేశం 75,000 చ.కి.మీ కంటే ఎక్కువ భూభాగంలో 52 టైగర్ రిజర్వ్లను కలిగి ఉండటం గర్వకారణం. పులుల రక్షణలో స్థానిక సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు వినూత్న చర్యలు చేపట్టడం జరిగింది.” అని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
Vizag Zoo Park: బరితెగించిన యువకులు.. పందుల ఎన్క్లోజర్లోకి దూకి..
2020లో విడుదలైన భారత పులుల గణన నివేదిక ప్రకారం, ప్రపంచంలోని పులుల సంఖ్యలో భారత్లో దాదాపు 70 శాతం ఉంది. ప్రపంచంలోని జీవవైవిధ్యంలో భారత్లో 8 శాతం ఉందని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ పులుల దినోత్సవం అనేది పులుల సంరక్షణ కోసం అవగాహన పెంచడానికి వార్షిక వేడుక. ఇది ఏటా జూలై 29న నిర్వహించబడుతుంది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్లో 2010లో ఈ రోజును నిర్ణయించారు. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం పులుల సంరక్షణ కోసం ప్రజల అవగాహన, మద్దతును పెంచడం, అలాగే పులుల సహజ ఆవాసాలను రక్షించడానికి ప్రపంచ వ్యవస్థను సమర్ధించడం.
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!