Nagam Janardhan Reddy: నేడు నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్.. జనార్దన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో ఆ పార్టీకి సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇంటికి బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వెళ్లారు. అనంతరం నాగం జనార్ధన్ రెడ్డితో వారు సమావేశం అయ్యారు. నాగంను బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు.
మరో నెల రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచుతూ ఉంటే.. కొందరు కీలక నేతలు తమకు పార్టీలో స్థానం దక్కడం లేదని రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ దక
జూపల్లి కృష్ణారావు అంత పెద్దోడు ఎప్పుడు అయ్యాడో నాకు అర్థం కాలేదు అని మాజీ మంత్రి నాగం జనార్థర్ రెడ్డి అన్నారు. ఇక్కడ గెలిచినోడు ఇక్కడే ఉంటాడు అని గ్యారంటీ ఎవరు ఇస్తారు.. నాగర్ కర్నూల్ నుంచి పోటీ ఎవరు చేస్తారన్న విషయం పార్టీ నిర్ణయిస్తుందని నాగం చెప్పారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల టైంలో మర్రి జనార్దన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపిస్తూ.. దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ ( సోమవారం ) హైకోర్టు కొట్టి వేసింది
వారంతా ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. జిల్లాను కనుసైగతో శాసించారు కూడా. మారిన రాజకీయాలు ఒంటబట్టలేదో.. ఉన్న పార్టీలలో ప్రాధాన్యం తగ్గిందో కానీ.. పొలిటికల్ స్క్రీన్పై కనిపించడం లేదు. వారెవరో ఇప్పుడు చూద్దాం. వర్తమాన రాజకీయాల్లో ఒంటరి ప్రయాణం! ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉద్ధండులైన రాజక�