ఆస్తి కోసం కొడుకు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి కర్కశకంగా చంపాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మోహన్లాల్గంజ్లో చోటు చేసుకుంది. హత్య అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. మృతుల చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండటంతో దశరథ్(26) పై తండ్రి కక్ష పెంచుకున్నాడు.
Hyderabad: హైదరాబాద్లోని పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ హత్య ఘటన నగరాన్ని తీవ్ర కుదిపేసింది. కుటుంబ ఆస్తుల కోసం జరిగిన ఈ హత్యలో చంద్రశేఖర్ సొంత మనవడు కీర్తి తేజ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 73 సార్లు కత్తితో పొడిచి తన తాతను హతమార్చిన కీర్తి తేజ, తండ్రి లేని కుటుంబంలో తాత ఇతర మనవళ్లను చూసినట్లుగా తనను చూడలేదని భావించి ఈ హత్యకు పాల్పిడినట్లు తెలుస్తోంది. వెలమాటి చంద్రశేఖర్ తన కంపెనీలో ఇటీవల ఒక…
మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ కల్వర్టు కింద జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో పోలీసులు మహిళను గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధన్కి చెందిన శివ నందగా పోలీసులు గుర్తు పట్టారు.
నెల్లూరులోని శ్రీనివాస్ నగర్లో మహబూబ్ బాషా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబ్ బాషా కుమార్తెను సాదిక్ అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమను మహబూబ్ బాషా అంగీకరించకపోవడంతో సాదిక్ ఆగ్రహానికి గురయ్యాడు.
అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం.. కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.4500 కోట్లను గత ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 114,000 ఇళ్ళు పూర్తి చేసిందని.. ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గం తేతలి గ్రామం నుంచి సీఎం చంద్రబాబు…
Gun Fire : అమెరికాలో ఉన్న ఒక యువకుడు పై దుండగులు కాల్పులు జరపగా, యువకుడు అక్కడే మృతి చెందాడు. ఈ యువకుడు, రవితేజ అనే పేరు గల హైద్రాబాద్ పట్నం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి లోని ఆర్కేపురం డివిజన్, గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 ప్రాంతం లో నివసించేవాడు. 2022 మార్చిలో, రవితేజ అమెరికా వెళ్లి అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇటీవల,…
Mumbai : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత, ముంబై భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబైలో మరో హై ప్రొఫైల్ హత్యాయత్నం జరగడం సిగ్గుచేటు అని శివసేన (యుబిటి) నాయకురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు.
ఖమ్మంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యం అయి కాలువ లో మృత దేహంగా లభ్యం అయిన సంజీవ్ కుమార్ అనే యువకుడి ఘటన విషాదాంతం అయ్యింది. పండుగ రోజున తన సోదరుని బైక్ పై తీసుకురావడానికి ఇంటి నుంచి వెళ్లి మృత్యు వాత పడ్డారు. తన సోదరుడికి వాయిస్ మెయిల్ పంపించాడు. ఒక మహిళను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారని నన్ను ఆటోతో కొట్టి చంపేస్తున్నారని వాయిస్ మెయిల్ లో సోదరుడికి పెట్టారు.
నార్సింగి పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో హత్యకు గురైన జంట కేసులో ట్విస్ట్ నెలకొంది. నార్సింగి పోలీస్ స్టేషన్ డబుల్ మర్డర్ కేసులో పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది.