అల్వాల్ లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇంట్లో పని చేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్లు పేట్ బషీర్ బాద్ ఏసీపీ రాములు తెలిపారు.
Sandalwood Actor Darshan Arrested in Murder Case: ఓ యువకుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్లో నివాసం ఉంటున్న రేణుకా స్వామి…
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఓ హత్య కేసులో నిందితుడు.. 26 ఏళ్లుగా వెతుకుతున్న 50 ఏళ్ల మిత్లేషియా ఉత్తమ్ పటేల్ను పోలీసులు అరెస్టు చేశారు. 1999లో రాజ్కోట్లోని జెట్పూర్లోని టైల్స్ ఫ్యాక్టరీలో ఓ వాచ్మెన్ ను హత్య చేశాడు. ఈ కేసులో మిత్లేషియా పటేల్ను నిందితుడిగా చేర్చారు. కాగా.. ఈ ఘటనపై క్రైమ్ ప్రివెన్షన్ బ్రాంచ్ విచారణ చేపట్టింది.
శ్రీ సత్య సాయి జిల్లాలో టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. జిల్లాలోని నల్లమడ మండలం కోటాలపల్లి గ్రామానికి చెందిన ఓటీడీపీ కార్యకర్తను గుర్తుతెలియని కొందరు దుండగులు విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. పొలం పనుల్లో భాగంగా ఆయన పొలంలో నిద్రిస్తున్న అమర్నాథ్ రెడ్డి ని అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు గొడవలతో దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైంది. జరగబోయే ఎన్నికల నేపధ్యంలో ఈ హత్య…
2018లో జరిగిన అంకిత్ సక్సేనా హత్య కేసులో తీస్ హజారీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు దోషులకు తీస్ హజారీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహ్మద్ సలీం, అక్బర్ అలీ, అతని భార్య షహనాజ్ బేగంలకు కోర్టు శిక్ష విధించింది. దీంతో పాటు ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా కూడా విధించింది. ఈ కేసుపై తీర్పును వెలువరిస్తూ.. దోషుల వయస్సు, నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని వారికి…
ఢిల్లీలో విద్యార్థి హత్య సంచలనం రేపుతుంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థి హత్య చేశాడు. అందుకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల లోపల ఏదో చిన్న సమస్యపై వారిద్దరు గొడవ పడ్డారని.. దీంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని ముఖంపై కొట్టాడని పోలీసులు…
విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. రుషికొండలోని అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ లను 22ఏ నుంచి తప్పించేందుకు ఎమ్మార్వోతో మణికంఠ గంగారాం ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం మేరకు ఎమ్మార్వో, రియల్టర్ గంగారాం మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ఇరువురి మధ్య రుషికొండ అపార్ట్మెంట్స్ తో పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు జరిగాయి.