Update On Murder Case : నిందుతుడి మానసిక పరిస్థితి బాగోలేదు.. మైనర్ బాలిక హత్య కేసు అప్డేట్..
- ప్రస్తుతం నిందితుడు మానసిక పరిస్థితి కూడా బాగోలేదని.
- విషయంపై రాష్ట్ర హోమ్ మినిష్టర్ అనితా రీయాక్షన్.
- నిందితుడు కోసం ఇప్పటికే 12 పోలీసు బృందాలు గాలీస్తున్నాయి.
- త్వరలోనే నిందితుడిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.
- 3 నెలల క్రితం జైలుకి వెళ్లి బయటకొచ్చి ఈ దారుణనికి ఒడిగట్టాడని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Update On Murder Case : అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పుగొండు పాలెంలో శనివారం ఓ దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి అమ్మాయిని హత్య చేశాడు. ప్రస్తుతం కొప్పుగొండు గ్రామంలో జులాయిగా తిరుగుతూ బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో విషయం కాస్త అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. ఆ సైకో వ్యక్తి సురేష్ పై ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపారు. ఇక 20 రోజుల కిందట బెయిల్ పై బయటకు వచ్చిన సురేష్ తనని జైలుకు పంపించారని కక్ష మనస్సులో పెట్టుకుని దారుణానికి సురేష్ పాల్పడ్డారు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మైనర్ బాలిక పై దాడి చేసేందుకు అప్పటికే రెక్కీ నిర్వహించి ఇంట్లోకి చేరుకున్న సురేష్ వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయి పీక కోసి పరార్ అయ్యాడు. ఆపై సంఘటనా స్థలానికి పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీం నిందితుడు కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. ఇక కేసు సమందించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
Urfi Javed : ఫుల్ గా తాగిన మత్తులో మీడియాకు అడ్డంగా దొరికిన ఉర్ఫీ జావేద్
Also Read
ఇక ఈ ఘటనపై తాజాగా ఎన్టీవీతో అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 టీంలతో గాలిస్తున్నామని., 4 నెలల క్రితం మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో ఫోక్సో యాక్ట్ క్రింద అరెస్టు చేశామని తెలిపారు. ఈ సంఘటనలో నిందితుడు ఒక నోట్ రాసి ఈ దారుణానికి ఒడిగట్టాడని., అందులో మేటర్ ఆధారంగా కూడ దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నందున కొన్ని విషయాలు వెల్లడించలేమని., ఏప్రిల్ లో మృతురాలు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామని., కోర్టులో గుడ్ బిహేవియర్ కింద బెయిల్ మీద వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు మానసిక పరిస్థితి కూడా బాగోలేదని ఆయన పేర్కొన్నారు.
CM Revanth Reddy: జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
ఈ విషయంపై రాష్ట్ర హోమ్ మినిష్టర్ అనితా రీయాక్షన్ అయ్యారు. దురదృష్టవశాత్తు రాంబిల్లి మండలంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యింది., నిందితుడు కోసం ఇప్పటికే 12 పోలీసు బృందాలు గాలీస్తున్నాయి., త్వరలోనే నిందితుడిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటాము., మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాము. సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఆదుకుంటాము., గంజాయి వినియోగం ఎక్కువ అవడంతోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి., 3 నెలల క్రితం జైలుకి వెళ్లి బయటకొచ్చి ఈ దారుణనికి ఒడిగట్టాడని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!