AP Crime: వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ… ప్రియురాలి పనే..!
- కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన యువకుడి హత్య..
- హత్య కేసును ఛేదించిన రాజోలు పోలీసులు..
- ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తించారు.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.. మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోయల్ జార్జ్.. గుడిమెల్లంక గ్రామానికి చెందిన రాపాక ప్రశాంతి (భర్తను వదిలేసిన వివాహిత) ప్రేమలో పడ్డాడని.. దీంతో.. గత కొంతకాలంగా పెళ్లి కాకుండానే ఇద్దరూ సహజీవనం చేశారని తెలిపారు.. అయితే, గంజాయి మత్తు పదార్థాలకు బానిసైన నోయల్ జార్జ్.. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని తన అన్న రాపాక ప్రకాష్ కు ప్రశాంతి చెప్పిందని వెల్లడించారు.
Read Also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్స్టార్..
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
అయితే, కాకినాడలో ఉంటున్న నోయల్ జార్జిని పథకం ప్రకారం ప్రశాంతి తో ఫోన్ చేయించి ప్రకాష్ దిండికి రప్పించాడు..రాపాక ప్రశాంతి, తన అన్న ప్రకాష్, స్నేహితుడు ఎర్రంశెట్టి ప్రేమ్ కుమార్ ముగ్గురు కలిసి నోయల్ జార్జ్ పై ఇనుప రాడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు.. వీరి నుండి తప్పించుకుని పారిపోయే సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మృతుడు జార్జ్.. కానీ, పారిపోతున్న నోయల్ జార్జిని పట్టుకుని ఇనుప రాడ్లతో కొట్టి ప్రాణం ఉండగానే దిండి బ్రిడ్జిపై నుండి గోదావరిలో విసిరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేలా చెప్పులు, మోటార్ సైకిల్ బ్రిడ్జిపై ఉంచి.. అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు అని తెలిపారు. ఈ నెల 10వ తేదీన నోయల్ జార్జి తండ్రి రత్న రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా మొదట నమోదు చేశాం.. ఈ నెల 13 న అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రం తీరాన లభ్యమైన నోయల్ జార్జ్ మృతదేహహంపై ఉన్న గాయాలతో సూసైడ్ కాదని ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని నిర్ధారణ చేసి కేసు నమోదు శాం.. హత్యకు కారణమైన నిందితులను రిమాండ్ కి తరలింవామని సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!