AP Crime: వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ… ప్రియురాలి పనే..!
- కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన యువకుడి హత్య..
- హత్య కేసును ఛేదించిన రాజోలు పోలీసులు..
- ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తించారు.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.. మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోయల్ జార్జ్.. గుడిమెల్లంక గ్రామానికి చెందిన రాపాక ప్రశాంతి (భర్తను వదిలేసిన వివాహిత) ప్రేమలో పడ్డాడని.. దీంతో.. గత కొంతకాలంగా పెళ్లి కాకుండానే ఇద్దరూ సహజీవనం చేశారని తెలిపారు.. అయితే, గంజాయి మత్తు పదార్థాలకు బానిసైన నోయల్ జార్జ్.. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని తన అన్న రాపాక ప్రకాష్ కు ప్రశాంతి చెప్పిందని వెల్లడించారు.
Read Also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్స్టార్..
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
అయితే, కాకినాడలో ఉంటున్న నోయల్ జార్జిని పథకం ప్రకారం ప్రశాంతి తో ఫోన్ చేయించి ప్రకాష్ దిండికి రప్పించాడు..రాపాక ప్రశాంతి, తన అన్న ప్రకాష్, స్నేహితుడు ఎర్రంశెట్టి ప్రేమ్ కుమార్ ముగ్గురు కలిసి నోయల్ జార్జ్ పై ఇనుప రాడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు.. వీరి నుండి తప్పించుకుని పారిపోయే సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మృతుడు జార్జ్.. కానీ, పారిపోతున్న నోయల్ జార్జిని పట్టుకుని ఇనుప రాడ్లతో కొట్టి ప్రాణం ఉండగానే దిండి బ్రిడ్జిపై నుండి గోదావరిలో విసిరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేలా చెప్పులు, మోటార్ సైకిల్ బ్రిడ్జిపై ఉంచి.. అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు అని తెలిపారు. ఈ నెల 10వ తేదీన నోయల్ జార్జి తండ్రి రత్న రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా మొదట నమోదు చేశాం.. ఈ నెల 13 న అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రం తీరాన లభ్యమైన నోయల్ జార్జ్ మృతదేహహంపై ఉన్న గాయాలతో సూసైడ్ కాదని ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని నిర్ధారణ చేసి కేసు నమోదు శాం.. హత్యకు కారణమైన నిందితులను రిమాండ్ కి తరలింవామని సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!