మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అనేది కేవలం ఒకరిద్దరి నిర్ణయం కాకూడదని, అత్యంత పారదర్శకంగా , సమిష్టిగా సాగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆయా మున్సిపాలిటీల బాధ్యతలు చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు , సీనియర్ నాయకులు అందరూ కలిసి చర్చించి, ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో అందరినీ కలుపుకుని పోవడం వల్ల పార్టీలో అంతర్గత విబేధాలు రాకుండా ఉంటాయని, ఇది ఎన్నికల్లో పార్టీ…
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు , స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా ఈ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు , జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వస్తున్న ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.…
సంగారెడ్డి జిల్లా పటాంచెరు రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పటాంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన నిర్ణయంపై బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం తాను చేసిన ఒక “తప్పటడుగు” అని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోకి మారడం వల్ల తన నియోజకవర్గానికి లేదా నియోజకవర్గ ప్రజలకు కనీసం “వెంట్రుక…
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీని సాధించి, తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ముఖ్యంగా మూడు దశాబ్దాలుగా శివసేన (UBT) కంచుకోటగా ఉన్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లో బీజేపీ సాధించిన విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గెలుపు కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాకుండా, మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసిన సంఘటనగా నిలిచిపోయింది.…
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. శనివారం ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ, రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. PhonePe కొత్త ఫీచర్.. ఒక క్లిక్తో చెల్లింపు.! ఎన్నికలకు నెల రోజుల…
Samarlakota Municipality: కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ పై నేడు అవిశ్వాస తీర్మానం సమావేశం జరగనుంది.. చైర్పర్సన్ అరుణ పై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది కౌన్సిలర్లు.. ఆర్జీవో మల్లిబాబు ప్రత్యేక అధికారిగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది.. వైసీపీ తరఫున చైర్పర్సన్గా ఉంటూ, ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నారని అరుణను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ.. అయితే, మున్సిపాలిటీలో మొత్తం 31…
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.. రానున్న మార్చి నాటికి మునిసిపాలిటీల పదవీకాలం పూర్తి కానున్నాయని అన్నారు. అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 15 స్టాండింగ్ కమిటీ సభ్యుల స్థానాలకు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ చెల్లుబాటు అయ్యేలా ఉన్నాయని GHMC కమిషనర్, రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కమిటీ సభ్యులుగా నిలబడిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. ఈ లోపు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటే, స్టాండింగ్…
Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి రాంబాబు ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్…
Elections In AP: ఆంధ్రప్రదేశ్లో నేడు (ఫిబ్రవరి 3)న 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ సీట్లను కాపాడుకోవాలని, వైసీపీ వీటిని గెలుచుకోవాలని వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. Also Read: Municipal Chairperson: నేడు హిందూపురంలో 144 సెక్షన్.. తిరుపతి…